M4M: తెలుగు సినిమాకు కేన్స్లో దక్కిన అరుదైన ఘనత
ABN , Publish Date - May 20 , 2025 | 01:33 PM
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో(2025) తెలుగు సినిమా సత్తా చాటింది. మోహన్ వడ్లపట్ల, జో శర్మ కామినేషన్లో వచ్చిన ‘ఎం4ఎం’ కేన్స్లోని ప్రెస్టీజియస్ PALAIS-C థియేటర్లో స్క్రీనింగ్ జరిగింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో(2025) తెలుగు సినిమా సత్తా చాటింది. మోహన్ వడ్లపట్ల, జో శర్మ కామినేషన్లో వచ్చిన ‘ఎం4ఎం’ (M4M - Motive for Murder) కేన్స్లోని ప్రెస్టీజియస్ PALAIS-C థియేటర్లో స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తెలుగు చిత్రసీమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్లతో పాటు అమెరికాకు చెందిన నటి జో శర్మ గౌరవంగా రెడ్ కార్పెట్పై మెరిశారు. ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు హర్షధ్వానాలు చేయడంతో పాటు, విమర్శకులు, సినీ అభిమానుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇది తెలుగు సినిమాకు కేన్స్లో దక్కిన అరుదైన ఘనత. ఇటీవల అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందుతున్న జో శర్మ, ఈ ఈవెంట్లో దుబాయ్, ఢిల్లీలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు.
మోహన్ మీడియా క్రియేషన్స్, మ్యాక్విన్ గ్రూప్ USA సంయుక్తంగా నిర్మించిన M4M, కేన్స్ 2025లో ప్రదర్శించిన ఏకైక తెలుగు చిత్రం. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథ అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథ బలంతో పాటు సినిమాటిక్ ప్రెజెంటేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని విమర్శకులు చెబుతున్నారు. ఈ ప్రీమియర్కు బాలీవుడ్, టాలీవుడ్ సహా ప్రపంచ సినీ పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు హాజరై చిత్రానికి అభినందనలు తెలిపారు. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాకు కేన్స్లో ఊరిస్తున్న ఈ అరుదైన గౌరవం, M4M మూవీకి దక్కడంతో ఈ ప్రీమియర్ తెలుగు చలనచిత్ర చరిత్రలో గొప్ప ఘట్టంగా నిలిచింది. త్వరలో ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.