Maruthi: తెరపై చూసుకోవాలనే కోరికతోనే అలా చేస్తున్నాడట..
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:01 PM
ప్రభాస్ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సోమవారం 'రాజాసాబ్' టీజర్ను విడుదల చేశారు. దాంతో ఒక్కసారిగా సినిమా హైప్ రెట్టింపు అయింది. దాంతో మారుతీకి క్రేజ్ బాగా పెరిగింది.
'ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమాతో కెరీర్ ప్రారంభించి అగ్ర హీరోలను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ఆయన ప్రభాస్తో ‘రాజాసాబ్’ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సోమవారం 'రాజాసాబ్' టీజర్ను విడుదల చేశారు. దాంతో ఒక్కసారిగా సినిమా హైప్ రెట్టింపు అయింది. దాంతో మారుతీకి క్రేజ్ బాగా పెరిగింది. మరోవైపు ఆయన కథలు ఇప్పుడు సినిమాలుగా మారబోతున్నాయి. మారుతి ఇచ్చిన కథలతో గతంలో కొన్ని చిత్రాలు తెరకెక్కాయి. ఇప్పుడు మరిన్ని సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. మారుతి రాసిన ఆరు కథల్ని.. ఆరుగురు దర్శకుల చేతుల్లో పెట్టారు. ఆరుగురు దర్శకులు ఈ కథలకు స్ర్కిప్టు రూపం ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. ఇవన్నీ సిద్ధమయ్యాక హీరోల వేట మొదలవుతుంది. తదుపరి సెట్స్ మీదకు వెళ్తాయని మారుతి సన్నిహితుల నుంచి వార్త బయటకు వచ్చింది.
అయితే ఈ చిత్రాలకు మారుతి కథకుడిగానే ఉంటారట. నిర్మాతలు మాత్రం వేర్వేరుగా ఉంటారు. మారుతి రచన గురించి తెలిసిందే. కామెడీ అతని బలం. కథను చాలా వేగంగా రాయగలడు. కొన్ని కథలు పెండింగ్లో ఉండటం వల్ల వాటిని తెరపై చూసుకోవాలన్న కోరికతోనే తన కథల్ని బయటి దర్శకులకు ఇస్తున్నారని తెలిసింది. ఈ మధ్యకాలంలో హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్స్ ఈ కథల్ని సినిమాగా తీయబోతున్నారని తెలిసింది. ఇతర వివరాలు త్వరలో వెల్లడవనున్నాయి. రాజాసాబ్ చిత్రం తర్వాత మారుతి లైనప్ మీద ఇప్పటికే క్లారిటీ వచ్చిందని సమాచారం. ఈ సారి మెగా హీరో చరణ్ సినిమా తీసేఅవకాశం ఉందట.