Dil Raju: ప్రభుత్వ అవార్డులు.. బాధ్యతతో స్వీకరించాలి
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:23 PM
శనివారం జూన్ 15న హైదరాబాద్లో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన విషయం విధితమే.
శనివారం జూన్ 15న హైదరాబాద్లో గద్దర్ అవార్డుల (Gaddar Awards) ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన విషయం విధితమే. టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హజరై కొత్ శోభను తీసుకు వచ్చి కార్యక్మరాన్ని దిగ్విజయం చేశారు. ఈ నేపథ్యంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తొలుత గద్దర్ అవార్డులు 2024 సంవత్సరానికి ఇవ్వాలని అనుకున్నామని, కానీ తర్వాత పెండింగ్లో ఉన్న పదేళ్లకు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 6 నెలలుగా వర్క్ చేసి అందరినీ కలుపుకుపోయి, మాట్లాడుకుని ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేయటం జరిగిందన్నారు. ముఖ్యంగా.. సిఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, భట్టి గార్లకు స్పెషల్ థ్యాంక్స్ అని వారు తొలి నుంచి గైడ్ చేస్తూ వచ్చారన్నారు.
అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ఎక్కువ సమయం కేటాయించాలని కోరడంతో రెండు గంటలు అదనపు సమయం ఇచ్చి అండగా నిలవడంతో వారి చేతుల మీదుగా చాలామందికి అవార్డులు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. త్వరలో ఏపీలో కూడా అవార్డుల ఉండొచ్చని, ప్రభుత్వం నుంచి అవార్డులు ఇచ్చేప్పుడు.. అందరూ వీలు చూసుకుని తమ బాధ్యతగా వచ్చి స్వీకరించాలని ఈ విషయాన్ని అందరూ అర్దం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. నిన్న ఈవెంట్ నిర్వహణపై మాకు చాలా మంది నుంచి అభినందనలు వచ్చాయన్నారు. అయితే ఇంత పెద్ద ఈవెంట్లో చిన్న తప్పులేమైనా జరిగి ఉంటే.. నా వైపు నుంచి క్షమాపణలు చెబుతున్నా అన్నారు.
ఇదిలాఉంటే.. నిన్న అవార్డులు అందుకోవాల్సి ఉన్న నటీనటుల్లో కొంతమంది సిటీలో అందుబాటులో ఉండి కార్యక్రమానికి హజరు కాకపోవడంపై విమర్శలు వచ్చాయి. వారిలో ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ల సినిమాలకు అవార్డ్స్ ఉన్నా రాకపోగా శేఖర్ కమ్ముల, మృణాల్ ఠాగూర్, శ్రీలీల తదితరుల పేర్లతో ఉండి ఖాళీగా కనిపించిన కుర్చీల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయి పలు విమర్థలకు తావిచ్చింది. కానీ ప్రస్తుతం టాలీవుడ్లో ఫామ్లో ఉన్న హీరోలు బాలకృష్ణ, అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి, సుకుమార్ వంటి దిగ్గజాలు కార్యక్రమానికి రావడంతో వారే వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలిచి వేరే వాళ్లు రాలేదనే వెలితిని పూడ్చింది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ప్రెస్మీట్ పెట్టి వారికి కాస్త చురకలు అంటించినట్టు మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది.