TG Vishwa Prasad: పెద్ద కాన్వాస్ ఉన్న సినిమా.. నిర్మాతగా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యా..
ABN , Publish Date - Sep 09 , 2025 | 07:04 PM
నిర్మాతగా 2017లో ఇండస్ట్రీలోకి వచ్చాను. 2018 నుంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రతి ఏడాది మాకు మంచి సక్సెస్లున్నాయి. 2024 నిరుత్సాహపరచింది. ఇప్పుడు మిరాయ్తో కమ్బ్యాక్ ఇస్తామని పూర్తి నమ్మకంతో చెబుతున్నా.
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’ (Mirai). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మనోజ్ మంచు పవర్ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) మీడియాలో మాట్లాడారు.
నిర్మాతగా 2017లో ఇండస్ట్రీలోకి వచ్చాను. 2018 నుంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రతి ఏడాది మాకు మంచి సక్సెస్లున్నాయి. 2024 నిరుత్సాహపరచింది. ఇప్పుడు మిరాయ్తో కమ్బ్యాక్ ఇస్తామని పూర్తి నమ్మకంతో చెబుతున్నా. మార్కెట్ లెక్కలు వేసుకోకుండా ఒక ఎక్స్ట్రార్డినరీ సినిమా ఇవ్వాలనే తపనతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా అనుకున్నప్పుడు తేజ హనుమాన్ సినిమా ఇంకా రాలేదు. కథణి చాలా నమ్మాం. ఇందులో దాదాపు ఒక పది లార్జర్ ఎపిసోడ్లు ఉంటాయి. మంచి కథ, మ్యూజిక్, గ్రేట్ లొకేషన్స్, అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నాకు చిన్నప్పుడు చందమామ కథలు, అమరచిత్ర కథలు అంటే చాలా ఇష్టం. ఆ కథలన్నీ కూడా మన రామాయణ మహాభారత ఇతిహాసాలకి కనెక్ట్గా ఉంటాయి. మిరాయ్ కూడా అద్భుతమైన ఫాంటసీ అడ్వెంచర్. చరిత్రతో పాటు ఫిక్షన్ కూడా బ్లెండ్ అయి ఉంది.
ప్రతి క్యారెక్టర్కి పర్పస్ ఉంటుంది..
కార్తీక్ కథ చెప్పగానే చాలా నచ్చింది. అశోకుడు మొత్తం జ్ఞానాన్ని 9 పుస్తకాల్లో నిక్షిప్తం చేశాడు. అందులో వాటి రక్షణ ఎనిమిది మంది యోధులకు ఇస్తాడు. ఒక పుస్తకం మాత్రం ఒక ఆశ్రమానికి ఇస్తాడు. ఆ పుస్తకాల ప్రాధాన్యం ఏంటి? వాటి కోసం హీరో, విలన్ ఎలాంటి పోరాటం చేశారనే అద్భుతంగా ఉంటుంది. తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. థాయిలాండ్లో యాక్షన్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అలాగే మనోజ్ పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తారు. మిరాయి ఒక తల్లి సంకల్పంతో ముడిపడిన కథ. ఆ సంకల్పం ఏమిటనే తెరపై అద్భుతంగా వచ్చింది.
ఈ సినిమాలో ప్రతి ఎలిమెంటు, క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఎస్లాబిష్మెంట్ నేచురల్గా వుంటుంది. డైరెక్టర్ కార్తీక్ ఫాంటసీ స్టోరీ టెల్లింగ్, మంచి కనెక్షన్తో సినిమాని తీశాడు.
భారీగా విడుదల...
కరణ్ జోహార్ సినిమా కంటెంట్ ని చూశారు. వాళ్లకు చాలా నచ్చింది. ఆయన నార్త్ లో రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. శ్లోకతో కలసి యూఎస్లో రిలీజ్ చేస్తున్నాము. కర్ణాటకలో హోంబాలే, కేరళలో గోకులం తమిళనాడులో ఏ జి ఎస్ రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ డిస్ర్టిబ్యూటర్స్ సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా చూస్తే రూ.300 కోట్లు ఖర్చు చేసిన సినిమాలా అనిపిస్తుంది. అయినా మేము టికెట్ రేట్స్ పెంచాలని అనుకోవడం లేదు. జనరల్గా ఉండే టికెట్ ధరలే పెట్టాం. ఈ సినిమాని ఎంతమంది చూశారు అనే దాని మీదే మా దృష్టి ఉంది. ఫ్యామిలీస్ పిల్లలు కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాము.
ఆ సీన్ అద్భుతం..
నిర్మాతగా పూర్తిగా ఇన్వాల్వ్ అయి తీసిన సినిమా ఇది. బిగ్ కాన్వాస్ ఉన్న సినిమా ఇది. గత ఏడాదిన్నరగా ఈ సినిమాతోనే ఎక్కువగా ట్రావెల్ అవుతున్నాను. బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసిన సినిమా ఇది. ఇందులో చాలా కాంప్లెక్స్గా అనిపించిన ఒక సీక్వెన్స్ ఉంది. ఇందులో ఒక సంపాతి అనే పక్షి ఉంటుంది. దీనికోసం ఒక చాలా పెద్ద ఫ్లోర్ ఉన్న సెట్ కావాల్సి వచ్చింది. రాజాసాబ్ వన్ అఫ్ ది లార్జెస్ట్ ఫిలిం షూటింగ్ ఫ్లోర్. మిరాయ్ కోసం చేసిన సీక్వెన్స్ సెకండ్ లార్జెస్ట్ ఫ్లోర్. 30000 ేస్క్వర్ ఫీట్ లో ఉంటుంది. అందులో ఒక సెట్ వేశాం. ఆ పక్షిని యానిమాట్రిక్స్ టెక్నాలజీతో చేయడం జరిగింది. ఇది చాలా కాంప్లెక్స్ వర్క్. పక్షితో ఇంతలా హ్యూమన్ ఇంటరాక్షన్ వున్న సినిమా ఇప్పటికీ రాలేదని భావిస్తున్నాను. ఇందులో శ్రీరాముడు కనిపించడానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. అది థియేటర్స్లో చాలా మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
'రాజాసాబ్' వచ్చేది ఎప్పుడంటే..
రాజాసాబ్ జనవరి 9న వస్తుంది. కాంతార2 తో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. ప్రభాస్ పుట్టినరోజున ఫస్ట్ సింగిల్ విడుదల చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం మా బ్యానర్లో తెరకెక్కుతున్న ‘తెలుసు కదా’ వచ్చే నెలలో విడుదల కానుంది. తర్వాత మోగ్లి ఉంటుంది. లావణ్య త్రిపాఠితో ఒక థ్రిల్లర్ చేస్తున్నాం. సునీల్ గారితో కూడా ఒక సినిమా చేస్తున్నాం. అవి కూడా ఈ ఏడాదిలోనే వస్తాయి. గూడచారి2, గరివిడి లక్ష్మి, అలాగే కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నాం. దాదాపు 12 సినిమాలు 2026- 2027 మధ్య మా సంస్థ నుంచి విడుదలవుతాయి.