Chiranjeevi: ఫాదర్స్డే సందర్భంగా తండ్రిని స్మరించుకుంటూ..
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:07 PM
ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి స్మరించుకున్నారు.
ఫాదర్స్ డే (Fathers Day) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి స్మరించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ుూమనం స్థిరంగా ఉండడానికి, జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి నాన్న ఎంతో తోడ్పాటు అందిస్తారని చెప్పారు. ‘నా తండ్రిని, నా సూపర్ (Super Hero) హీరోని స్మరించుకుంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
‘తమ బలం, జ్ఞానం, ప్రేమతో జీవితాలను తీర్చిదిద్దే ప్రపంచంలోని అద్భుతమైన తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రం పూర్తి చేశారు. వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకుడు. తదుపరి అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.