Chiranjeevi: ధనుష్.. జాతీయ పురస్కారంపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:43 AM
దేవ పాత్రలో ధనుష్ని తప్ప ఎవరినీ ఊహించుకోలేం. ఓ సన్నివేశంలో బెగ్గర్ పాత్రలో ధనుష్ని గుర్తించలేకపోయా. అంతగా ఒదిగిపోయాడు. అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే.
"దేవ పాత్రలో ధనుష్ని తప్ప ఎవరినీ ఊహించుకోలేం. ఓ సన్నివేశంలో బెగ్గర్ పాత్రలో ధనుష్ని గుర్తించలేకపోయా. అంతగా ఒదిగిపోయాడు. అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే. అంత నేచురల్గా క్యారెక్టర్లో ఇమిడిపోయారు. ఈ సినిమాతో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి. తనకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు. తనకి ఈ సినిమాకి అవార్డు వస్తే కనుక ప్రతి ఒక్కరికి గర్వకారణం’’ అని చిరంజీవి అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ‘కుబేర’ సక్సెస్ సెలబ్రేషన్స్కు ఆయన అతిథిగా హాజరయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక కీలక పాత్రలో పోషించిన కుబేర’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్తో ముందుకెళ్తుంది.
ఈ సందర్భంగా సక్సెస్ మీట్కి అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ "కుబేర సక్సెస్ మీట్ నా సక్సెస్ మీట్లా అనిపిస్తుంది. అలాంటి ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నాను. ఇక్కడ ఉన్నవాళ్లంతా నాకు కావలసిన వాళ్లే. ఈ టీమ్ మొహంలో ఆనందం చూస్తుంటే ఇది నా సక్సెస్లా అనిపిస్తోంది. ఇక్కడకి నేను గెస్ట్ గా రాలేదు. మీలో ఒకడిగా, ఆత్మీయుడుగా వచ్చాను. ఈ సినిమాకు ముందు నాగార్జున ఓసారి కలిశారు. కథ గురించి అడిగాను. ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ధనుష్ది లీడ్ రోల్ అని చెప్పారు. ఎలా ఒప్పుకున్నావు అని అడిగా. డిఫరెంట్ రోల్ చేయాలని ఎక్కడో నాకే అనిపించింది. కొత్త వరవడికి రూట్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. అలా ఈ సినిమా కుదిరింది. నేనీ సినిమా చూశాక 100% కరెక్ట్ అనిపించింది. ఈ సినిమా తర్వాత తను మరో 40 ఏళ్లు అద్భుతంగా రాణిస్తారనిపించింది. శేఖర్ కమ్ముల ఈ పాత్ర రాయడం, అది నాగ్ అంగీకరించడమే మొదటి సక్సెస్. దేవ పాత్రలో ధనుష్ని తప్ప ఎవరినీ ఊహించుకోలేం. ఓ సన్నివేశంలో బెగ్గర్ పాత్రలో ధనుష్ని గుర్తించలేకపోయా. అంతగా ఒదిగిపోయాడు. అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే. అంత నేచురల్గా క్యారెక్టర్లో ఇమిడిపోయారు. ఈ సినిమాతో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి. తనకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు. తనకి ఈ సినిమాకి అవార్డు వస్తే కనుక ప్రతి ఒక్కరికి గర్వకారణం. ఈ సినిమాను ఓ ఎక్స్పీరియన్స్లా చూశా. ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల్లో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు శేఖర్. స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతున్నప్పుడు నన్ను ఓ అభిమానిలా కలిశారు. ఆరోజే సినిమా ఇండస్ర్టీలో స్థిరపడిపోవా?ని నిర్ణయించుకున్నారు. దర్శకుడిగా ఆయన చక్కని సినిమాలు తీస్తుంటే గర్వంగా ఉంది. పైగా ఆయనకిది సిల్వర్ జూబ్లీ ఇయర్. అందుకు ఆయనకు మరోసారి అభినందనలు. వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలు తీస్తారాయన. నిజంగానే నాగార్జున కొత్త దారికి నాంది పలికారు. నేను కూడా ఆయన రూట్లోకి రావచ్చు. రష్మిక నేషనల్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. తన క్యారెక్టర్లో ఇంటెన్సిటీ ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో సమీరా క్యారెక్టర్ చూసినప్పుడు చూడాలని ఉంది లో సౌందర్య గుర్తుకొచ్చింది. దేవిశ్రీప్రసాద్ నా బిడ్డ లాంటివాడు. నా కంబ్యాక్లో కూడా అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. తన ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది. దేశం మొత్తం తనని కీర్తిస్తోంది. సినిమా చాలా మ్యూజికల్గా ఉంది. అది దేవిశ్రీ రికార్డింగ్లో అద్భుతం చేశాడు. ఇందులో తల్లి మీద పాడిన పాట ఖైదీ నం. 150 లో ునీరు నీరు’ పాటను మైమరపించేలా ఉంది. సినిమా సక్సెస్ గగనం అయిపోతున్న రోజులువి. థియేటర్స్ కి ఆడియన్స్ రప్పించడం గగనం అయిపోతున్న రోజులివి. ఇలాంటి సమయంలో ఇలాంటి కంటెంట్ వుంటే ఆడియన్స్ థియేటర్స్కి వస్తారని భరోసా కల్పించిన సినిమా ఇది. ఈ క్రెడిట్ శేఖర్ కమ్ములకే దక్కుతుంది’’ అని అన్నారు.
'దీపక్ అయిపోయావు' అన్నారు: నాగార్జున
"చిరంజీవి గారికి థాంక్యూ. ఇండస్ట్రీ అంతా చిరంజీవి గారిని ఎంతగానో ప్రేమిస్తుంది. విక్రమ్ సినిమా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించారు. అమీర్ ఖాన్ గారు హిందీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సినిమాని పక్కనుండి సపోర్ట్ చేశారు. చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా కావచ్చు.. సపోర్ట్ చేయడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది శేఖర్ కమ్ముల ఫిల్మ్. థ్రిల్లర్ తో హ్యూమన్ ఎమోషన్ తో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఈ సినిమాతో కుదిరింది. ఈ సినిమాలో దీపక్, దేవా, సమీరా ఇలా అన్ని పాత్రలే తప్పా స్టార్స్ కనిపించరు. ఆయనకి థాంక్యూ నాకు తెలియని యాక్టింగ్ ఏదో ఇందులో నేర్పించారు(నవ్వుతూ) నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రతిరోజు కొత్తగా ఉండేది. చిరంజీవి గారు వచ్చేటప్పుడు కార్లో చెప్పారు 'చాలా బాగా చేశావు దీపక్ అయిపోయావు' అన్నారు. అప్పుడు నాకు శేఖర్ కమ్ముల గొప్పతనం అర్థమైంది. అన్ని చోట్ల మూడురేటింగ్ పడింది. మిరాకిల్ ని శేఖర్ క్రియేట్ చేశాడు. ధనుష్ ని సెట్ లో అసలు పోల్చుకోలేకపోయా. సినిమా అంతా దేవా క్యారెక్టర్ లోనే ఉన్నారు. అలా ఉండడం అంత ఈజీ కాదు. రష్మికని చూస్తే క్షణక్షణం లో శ్రీదేవి గారి గుర్తుకొచ్చారు. ఈ సినిమాలో తను చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరో 40 ఏళ్ళు తిరుగుండదు" అని అన్నారు.
అనుమానాలన్నీ తొలగిపోయాయి: శేఖర్ కమ్ముల
‘‘చిరంజీవి నా లక్కీ చార్మ్ అయిపోయారు. కాలేజీ రోజుల్లో మిమ్మల్ని కలిశా. అప్పుడు మీరిచ్చిన షేక్హ్యాండ్ ఇప్పటికీ గుర్తుంది. ఎప్పటికైనా మీతో సినిమా తీయాలన్న కల ఉందని ఇటీవల మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పా. మీరు నాకెంతో క్లోజ్ అనిపిస్తుంటుంది. ఇక ఇలాంటి విభిన్నమైన కథలను ప్రేక్షకులుయ ఎలా స్వీకరిస్తారో అని అనుమానం ఉండేది. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోతో నా అనుమానాలన్నీ తొలగిపోయాయి. ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ రుణం తీర్చుకోలేనిది. మీ ఆదరణే ఇలాంటి ఎన్నో చిత్రాలు తెరకెక్కించేందుకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ను ఎందుకు ఎంపిక చేశారోనని చాలామంది అనుకున్నారు. ఆయనతో కలిసి వర్క్ చేయాలని అందరికీ ఉంటుంది. మేం గతంలోనే కలిసి పని చేయాల్సి ఉంది. ఇప్పుడు కుదిరింది. ఇందులో ‘కుర్రాడు బాగా నటించాడు’ అని నాగార్జునపై మా అమ్మ ప్రశంసలు కురిపించింది. ధనుష్ నటననూ మెచ్చుకుంది. అందరూ సినిమా నిడివి ఎక్కువ అయిందని అంటున్నారు. మా అమ్మ మాత్రం ‘మరో 10 నిమిషాలు ఉంటే బాగుండేది’ అని చెప్పింది.
మరో మెట్టు ఎక్కాను: రష్మిక మందన్నా..
"నా చాలా సినిమాలకు చిరంజీవిగారు అతిథిగా హాజరయ్యారు. దాంతో ఆయన నా జీవితంలో భాగమైన భావన కలుగుతుంది. ఏదైనా సినిమా అంగీకరించేటప్పుడు చాలా అనుమానాలు ఉంటాయి. కానీ, ‘కుబేర’ విషయంలో అలాంటిదేం లేదు. దర్శకుడు ఎలా చెబితే అలా సమీర పాత్ర పోషించా. ఇలాంటి రోల్ నాకు దక్కినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. శేఖర్, నాగార్జున, ధనుష్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మూల స్తంభాలు’’ అని అన్నారు.