Chiranjeevi: యోగా.. ప్రపంచానికి భారత్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్
ABN , Publish Date - Jun 10 , 2025 | 03:19 PM
యోగాను (yoga day) ఉద్దేశించి అగ్ర కథానాయకుడు చిరంజీవి (chiranjeevi) తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి అని ఆయన అన్నారు.
యోగాను (yoga day) ఉద్దేశించి అగ్ర కథానాయకుడు చిరంజీవి (chiranjeevi) తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి అని ఆయన అన్నారు. జూన్ 21న యోగా దినోత్సవాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీని గురించి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘ఫోకస్ వల్ల ఫిట్నెస్ పెరుగుతుంది. యోగా చేస్తే ఈ రెండూ వస్తాయి. యెగా డేను సెలబ్రేట్ చేసుకుందాం.. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. సరిహద్దులు దాటి దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా మాసోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో యోగా డేను నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో (AP govt) యోగా దినోత్సవంపై ప్రజల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, ఏపీ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జూన్ 21న ఏపీలో యోగా దినోత్సవం నిర్వహించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.