Kannappa: మంచు విష్ణుకు.. త‌ప్ప‌ని క‌న్న‌ప్ప క‌ష్టాలు

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:02 PM

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు క‌న్న‌ప్ప‌కు ఇప్ప‌ట్లో వివాదాలు తీరేలా అనిపించ‌డం లేదు.

vishnu

మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెర‌కెక్కిన చిత్రం క‌న్న‌ప్ప (Kannappa Movie). అయితే ఈ సినిమా ఆది నుంచి వివాదాలు, విమ‌ర్శ‌ల చుట్టూ విడుద‌ల కూడా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఈ స‌మ‌స్య‌లు ల‌న్నీ తీరాయి ఇక విడుద‌లే ఆల‌స్యం అనుకున్న స‌మ‌యంలో తీరా మూవీ రిలీజ్ మరో వార‌మే ఉన్న స‌మ‌యంలో ఈ చిత్రంలోని పిల‌క‌, గిల‌క పాత్ర‌లు త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక (Brahmin Chaitanya Vedika)సెన్సార్ బోర్డును ఆశ్ర‌యించ‌డంతో మ‌రోమారు క‌న్న‌ప్ప చిత్రం వార్త‌ల్లో నిలిచింది.

అదే స‌మ‌యంలో క‌న్న‌ప్ప చిత్రం సైతం సెన్సార్ కోసం రావ‌డంతో సినిమా వీక్షించిన 11 మంది సభ్యుల కమిటీ.. సనాతన ధర్మాన్ని సాంప్రదాయాలను కించపరచడం, దేవి దేవతలను, పిలక గిలక పాత్రలతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, కోయ కులాన్ని కించపరిచే 13 సన్నివేశాలు తొలగించాల్సిందే అని రివిజన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఆ 13 సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ స‌న్నివేశాల‌ను తొల‌గించిన అనంత‌రం సినిమా కాపీ ఇచ్చిన తర్వాతే మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ తెలిపారు. కాగా ఆదివారం సాయంత్రం 11 మంది రివిజన్ కమిటీ సభ్యులతో పాటు మంచు విష్ణు కూడా సినిమా చూసిన వారిలో ఉన్నారు.

kannappa.jpg

అయితే.. కన్నప్ప సినిమా రిలీజ్‌కు ముందు నుంచే సినిమాలో సనాతన ధర్మాన్ని, బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయాల‌ను, దేవీ దేవతలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక మొదటి నుంచి చెప్తూ వ‌స్తూంది. అంతేగాక కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కావాలని మంచు కుటుంబం గుంటూరులో జూన్ 7న పెట్టడం అదేరోజు సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, బ్రాహ్మణ చైతన్య వేదిక, ఏపీ అర్చక సేవా సంఘం, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.

ఈ క్ర‌మంలో కన్నప్ప సినిమాపై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ నెం.6236/2025 కేస్ పెండింగ్‌లో ఉండ‌గా ప్రతివాదులుగా రీజనల్ ఆఫీసర్, సెన్సార్ బోర్డ్ , సినీమా నిర్మాత మంచు మోహన్ బాబు నటులు మంచు విష్ణు బ్రహ్మానందం, సప్తగిరి లు ఈ కేసులో తమ వాదనలు వినిపించాల్సి ఉంది. తాజాగా ఆదివారం క‌న్న‌ప్ప సినిమా స‌న్నివేశాల‌పై సెన్సార్ బోర్టు క‌మిటీ అభ్యంత‌రాలు వ్య‌క్త ప‌రిచి 13 సీన్లు తొల‌గించాల‌ని చెప్పిన నేప‌థ్యంలో బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ సెన్సార్ బోర్డుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - Jun 16 , 2025 | 12:03 PM