SSMB29: మహేష్- రాజమౌళి సినిమాలో మాధవన్..?
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:16 PM
దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) ఆర్ఆర్ఆర్(RRR) లాంటి భారీ విజయం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో SSMB29 మొదలుపెట్టిన విషయం తెల్సిందే.
SSMB29: దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) ఆర్ఆర్ఆర్(RRR) లాంటి భారీ విజయం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో SSMB29 మొదలుపెట్టిన విషయం తెల్సిందే. రెండేళ్లు స్క్రిప్ట్ పై వర్క్ చేసి ఈ ఏడాదిలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి లీక్ అయిన ఫోటోలు సంచలనాన్ని సృష్టించాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ఇప్పటికే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) SSMB29 లో విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో అది నిజమే అని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో మరో స్టార్ హీరో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ హీరో మాధవన్(Madhavan) SSMB29 లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇక ఈమధ్యకాలంలో మాధవన్ భారీ ప్రాజెక్ట్స్ తో మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఎంతో టాలెంట్ ఉన్న నటుల్లో మ్యాడీ ఒకడు. SSMB29 లో కీలక పాత్ర కోసం జక్కన్న మాధవన్ ను ఫైనల్ చేశాడని, రాజమౌళి సినిమాలో పాత్ర అనగానే సీనియర్ హీరో కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాలో మాధవన్ పాత్ర చాలా కీలకమని, మహేష్ మెంటర్ లా కనిపిస్తాడని టాక్. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో క్యాస్టన్గ్ ని కూడా ఆ రేంజ్ లోనే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. అందుకే స్టార్స్ ను రంగంలోకి దించుతున్నారని సమాచారం. మరి ఇందులో నిజామెంత అనేది తెలియాల్సి ఉంది.