బ్లాక్‌బస్టర్‌ రివ్యూలు వచ్చాయి

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:05 AM

నాగార్జున, ధనుష్‌ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ‘కుబేర’ చిత్రం చక్కటి ప్రేక్షకాఽధణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం...

నాగార్జున, ధనుష్‌ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ‘కుబేర’ చిత్రం చక్కటి ప్రేక్షకాఽధణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ ‘ఈ సినిమాకు తొలిసారి ఏకగ్రీవంగా బ్లాక్‌ బస్టర్‌ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులకు సినిమా అంతగా నచ్చింది. నాకు ఎప్పటి నుంచో ఒక కొత్త క్యారెక్టర్‌ చేయాలని ఉండేది. శేఖర్‌ సినిమాలన్నీ చూశాను. ఆయన క్యారెక్టర్‌కి అద్భుతంగా న్యాయం చేస్తారు. ఈ కథ వినగానే నాది మెయిన్‌ క్యారెక్టర్‌ అనిపించింది. శేఖర్‌ కూడా అలానే చెప్పారు. ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లన్నీ ఒకలా ఉంటే నేను పోషించిన దీపక్‌ పాత్రలో మూడు కోణాలు ఉంటాయి. నా క్యారెక్టర్‌ పట్ల అభిమానులు కూడా ఆనందంగా ఉన్నారు’ అని అన్నారు. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ అనుకన్నప్పటి నుంచి హాలీవుడ్‌ స్థాయిలో తీద్దాం అని అనుకున్నాను. నాగార్జున గారు మాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. అలాగే ధనుష్‌ తన నటనతో మెప్పించారు. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో ఇది వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ అవుతుంది’ అని అన్నారు. నిర్మాత సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని కథ విన్నప్పుడే చెప్పాను’ అని అన్నారు. నిర్మాత పుస్కూర్‌ రామ్మోహన్‌ మాట్లాడుతూ ‘ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌ బస్టర్‌ రిపోర్టు వచ్చింది. నిర్మాతలుగా మేము సంతోషంగా ఉన్నాం’ అని చెప్పారు.

Updated Date - Jun 22 , 2025 | 04:21 AM