Lakshmi Narasimha: కొత్త పాటతో.. రీ రిలీజ్‌

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:22 AM

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘లక్ష్మీనరసింహా’ చిత్రం మరోసారి ప్రేక్షకులను థియేటర్లలో అలరించనుంది. జయంత్‌ సీ పరాన్జీ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్‌ నిర్మించిన ఈ చిత్రం 2004లో...

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘లక్ష్మీనరసింహా’ చిత్రం మరోసారి ప్రేక్షకులను థియేటర్లలో అలరించనుంది. జయంత్‌ సీ పరాన్జీ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్‌ నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలైంది. ఈ చిత్రాన్ని ఈ నెల 8న రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ మాట్లాడుతూ ‘21 ఏళ్ల తర్వాత ‘లక్ష్మీ నరసింహా’ను విడుదల చేస్తున్నాం. అప్పట్లో చిత్రీకరించిన ఒక పాటను నిడివి దృష్ట్యా పక్కనపెట్టాం. ఆ నెగిటివ్‌ను వెతికిపట్టుకొన్నాం. అయితే ఆడియో మాత్రం దొరకలేదు. దాంతో చంద్రబో్‌సకు, భీమ్స్‌ సిసిరోలియోకు చూపించి, కొత్త పాటను రాయించి, రికార్డ్‌ చేశాం. ‘మందేసినోడు’ అంటూ సాగే ఈ పాట రీ రిలీజ్‌లో ప్రత్యేకాకర్షణ అవుతుంది’ అన్నారు. జయంత్‌ సీ పరాన్జీ మాట్లాడుతూ ‘పాత ఫుటేజ్‌కు ఆడియోను యాడ్‌ చేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సురేశ్‌గారు’ అని అన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 06:38 AM