బాలకృష్ణతో మరోసారి
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:34 AM
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా పంచుకున్నారు...
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణతో మరోసారి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మా కాంబో చేసే గర్జన మరింత ఎక్కువగా ఉండబోతోంది. చరిత్రలో నిలిచిపోయే చిత్రమిది’’ అని పేర్కొన్నారు. మంగళవారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇది ఆయన నటించనున్న 111వ చిత్రం. వెంకట్ సతీష్ కిలారు నిర్మించనున్నారు. కాగా, బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో ‘వీరసింహా రెడ్డి’ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.
అఖండ 2 టీజర్ వచ్చేస్తోంది
హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. వారి కలయికలో నాలుగోసారి తెరకెక్కుతోన్న సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమా టీజర్ను నేడు విడుదల చేయనున్నారు మేకర్స్.
For AndhraPradesh News And Telugu News