Kannappa: పిలక.. గిలక తొలిగించాలి.. బ్రాహ్మణ సంఘాలు డిమాండ్‌

ABN , Publish Date - Jun 07 , 2025 | 08:39 PM

మంచు విష్ణు (Manchu Vishnu) సినిమాలకు సమస్యలు కొత్తేమీ కాదు. వేదికలపై మాట్లాడే మాటలతో ట్రోలింగ్‌కు గురవడం ఒక కారణమైతే.. మరో రూపంలో వచ్చే చిక్కులు మరి కొన్ని. తాజాగా విష్ణు చేస్తున్న ‘కన్నప్ప’కు (Kannappa) మరో అడ్డంకు ఎదురైంది.

Manchu Vishnu


మంచు విష్ణు (Manchu Vishnu) సినిమాలకు సమస్యలు కొత్తేమీ కాదు. వేదికలపై మాట్లాడే మాటలతో ట్రోలింగ్‌కు గురవడం ఒక కారణమైతే.. మరో రూపంలో వచ్చే చిక్కులు మరి కొన్ని. తాజాగా విష్ణు చేస్తున్న ‘కన్నప్ప’కు (Kannappa) మరో అడ్డంకు ఎదురైంది.  కొద్దిరోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన హర్డ్‌డిస్క్‌ మాయం కావడంతో మూవీ టీమ్‌ తీవ్ర ఆందోళన చెందింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా ‘కన్నప్ప’ మీద బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. తమ వర్గాన్ని కించపరచేలా ఈ చిత్రంలో రెండు పాత్రలు ఉన్నాయిని బ్రాహ్మణులు ఆరోపిస్తున్నారు.


'కన్నప్ప' సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌ లో జోరు పెంచిదిఇ. ఇందులో భాగంగా సినిమాలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండి పడుతున్నాయి. శనివారం గుంటూరులో జరగనున్న సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో  ఆ పేర్లు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ వివాదం గురించి బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మంచు మోహన్‌బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటాం’’ అని హెచ్చరించారు.

ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతీ ముకుందన్‌ హీరోయిన్‌గా నటించారు. మోహన్‌బాబు, ఆర్‌.శరత్‌కుమార్‌, మోహన్‌లాల్‌, ప్రభాస్, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, బ్రహ్మానందం ఇతర  నటించారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్మెంట్స్‌పై  మోహన్‌బాబు నిర్మించారు.

Updated Date - Jun 07 , 2025 | 08:48 PM