AM Rathnam: తెలంగాణ సీఎంను కలిసిన నిర్మాత ఎ.ఎం రత్నం

ABN , Publish Date - May 30 , 2025 | 05:01 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని (Revanth reddy) సినీ నిర్మాత ఎ.ఎం.రత్నం (A. M. Rathnam) కలిశారు. ‘హరిహర వీరమల్ల్లు’  చిత్రానికి సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని (Revanth reddy) సినీ నిర్మాత ఎ.ఎం.రత్నం (A. M. Rathnam) కలిశారు. ‘హరిహర వీరమల్ల్లు’  చిత్రానికి సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మణ సంస్థ ఓ పోస్ట్‌ చేసింది. 17వ శతాబ్దానికి సంబంధించిన కథతో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ గురించి సీఎంతో చర్చించాను.  అలాగే తెలంగాణలో ఈ సినిమా టికెట్‌ ధరల గురించి కూడా మాట్లాడినట్లు, తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఎ.ఎం రత్నం కృతజ్ఞతలు తెలిపారు.  పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీరమల్ల్లు’. నిధి అగర్వాల్‌ కథానాయిక. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం జూన్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Updated Date - May 30 , 2025 | 05:01 PM