Ajay Devgn: నిమిషానికి.. రూ.4 కోట్లు
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:41 AM
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన తీసుకునే పారితోషికం గురించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది...
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన తీసుకునే పారితోషికం గురించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 2022లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఆ చిత్రంలో ఓ అతిథి పాత్రలో అజయ్ దేవగణ్ నటించిన విషయం తెలిసిందే. ఇందులో స్వాతంత్య్రం కోసం పోరాడే వీరుడి పాత్రలో ఆయన ఎనిమిది నిమిషాల పాటు కనిపించారు. ఇంత చిన్న నిడివి ఉన్న పాత్ర కోసం ఆయన సుమారు రూ.35 కోట్లను నిర్మాతల ముక్కు పిండి వసూలు చేశారట. అంటే నిమిషానికి రూ.నాలుగు కోట్లపైనే. ఇది విన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. నిమిషాల పరంగా చూస్తే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు ఆయనే అని లెక్కలు వేస్తున్నారు. అలాగే, ఓటీటీ పరంగానూ రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకున్న ఘనత అజయ్ దేవగణ్ సొంతం. 2021లో విడుదలైన ‘రుద్ర’ అనే సిరీ్సలో నటించడానికి ఆయన రూ.125 కోట్లు తీసుకున్నారని సమాచారం. అలాగే, సినిమా స్థాయిని బట్టి ఆయన తీసుకునే పారితోషికం మారుతుందట. భారీ బడ్జెట్ సినిమాకైతే రూ.40 కోట్లు.. తక్కువ స్థాయి బడ్జెట్లో తెరకెక్కే చిత్రాలకు రూ.20 కోట్ల వరకూ తీసుకుంటారట.