Poonamkaur: త్రివిక్ర‌మ్‌ను వదిలిపెట్ట‌ను.. నా దగ్గర ఆధారాలున్నాయి...

ABN, Publish Date - May 21 , 2025 | 11:08 AM

తెలుగ‌మ్మాయి, న‌టి పూనమ్ కౌర్ మ‌రోసారి బాంబు పేల్చింది. ఇన్ స్టా వేదిక‌గా రెండు పోస్టులు పెట్టింది.

trivikram

తెలుగ‌మ్మాయి, న‌టి పూనమ్ కౌర్ (Poonam Kaur) మ‌రోసారి బాంబు పేల్చింది. ఇన్ స్టా వేదిక‌గా రెండు పోస్టులు పెట్టి త్రివిక్ర‌మ్ (Trivikram) ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. త్రివిక్రమ్‌ను ఎవ‌రో పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారు? అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఈ విషయం ముందే చెప్పాను, మళ్లీ చెబుతున్నాను ఈమెయిల్‌లో నా స‌మ‌స్య తెలుపుతూ ఫిర్యాదు చేశాను, ఝాన్సీగారితో మాట్లాడాను, మీటింగ్ పెడదాం అని చెప్పి హఠాత్తుగా నన్ను డిస్టర్బ్ చేయవద్దని చెప్పింది. నేను ఎవరి పేరు చెప్పలేదు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నాకు ఫిర్యాదు ఉందని స్పష్టంగా చెబుతున్నాను అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. అంతేకాదు నా వ‌ద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ ఝాన్షీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ల‌ను బ‌య‌ట పెట్టింది. దీంతో గ‌త కొంత కాలంగా స్త‌బ్దుగా ఉన్న‌ ఈ ఇష్యూ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

మ‌ల‌యాళ మీటూ ఇష్యూ, జానీ మాస్ట‌ర్ ఇష్యూలు పెద్దెత్తున్న జ‌రుగుతున్న‌ స‌మ‌యాల్లో పూన‌మ్ కౌర్‌ సోష‌ల్ మీడియా ద్వారా ఎక్స్‌లో త్రివిక్ర‌మ్‌పై పోస్టులు చేసి ఆయ‌న‌ను విచారించాలంటూ మా అసోషియేష‌న్‌కు ఫిర్యాదు చేసింది. అయితే సోష‌ల్‌మీడియా ద్వారా అలా పోస్టులు పెడితే కుద‌ర‌దు స్వ‌యంగా ఫిర్యాదు చేయాల‌ని తెల‌ప‌డంతో పూన‌మ్‌ ఈ మెయిల్ ద్వారా క‌మిటీకి విష‌యం తెలిపింది. ఆ త‌ర్వాత ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో ‘మా’ను ఉద్దేశిస్తూ పోస్టు పెట్టారు. ‘త్రివిక్రమ్‌త్రివిక్ర‌మ్ (Trivikram)పై ఫిర్యాదు చేసి ఎంతో కాలమైంది.


కానీ ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) నుంచి ఎటువంటి స్పందన రాలేదు. త్రివిక్రమ్‌పై ఇచ్చిన ఫిర్యాదు విషయంలో ‘మా’ సంఘం ఆయన్ని ప్రశ్నించలేదు. నా జీవితాన్ని నాశనం చేసి.. ఆరోగ్యాన్ని.. ఆనందాన్ని కోల్పోయేలా చేసిన ఆయనపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ఆయన విషయంలో చర్యలు తీసుకోకుండా ఉండేలా ఇండస్ట్రీ పెద్దల నుంచి సహకారం అందుతోంది’ అని ఆరోపించారు. త‌ర్వాత మ‌ళ్లీ ఈ అంశం గురించి ఎక్క‌డా చ‌ర్చ‌కు రాక మ‌రుగున ప‌డింది.

అయితే ఇటీవ‌ల పూనమ్ కౌర్ (Poonam Kaur) ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసి నేప‌థ్యంలో తివిక్ర‌మ్ త్రివిక్ర‌మ్ (Trivikram)తో స‌మ‌స్య తీరిపోయింద‌ని అందుకే ప‌వ‌న్ భాగ‌స్వామి అయిన కూట‌మి సీఎంను పూన‌మ్ క‌లిసింది ఇకపై ఎలాంటి ఫిర్యాదులు ఉండ‌వు అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల నుంచి కామెంట్లు ఎదుర‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే పూన‌మ్ స్పందించి తాజాగా ఈ పోస్టులు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

Updated Date - May 21 , 2025 | 12:04 PM