Shambhala: ఆసక్తికరంగా ‘శంబాల' టీజర్ 

ABN , Publish Date - Jun 07 , 2025 | 01:59 PM

ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’.

ఆది సాయి కుమార్(Aadi Sai kumar) హీరోగా తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ (Shambala). షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్న భీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. యుగంధర్ ముని (Yugandhar muni) దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ కీలక పాత్రధారులు. తాజాగా ఈ చిత్రం  టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘ఈ విశ్వంలో అంతు పట్టని రహస్యాలెన్నో ఉన్నాయి.. సైన్స్‌కి సమాధానం దొరకనప్పుడు మూఢ నమ్మకం అంటుంది.. అదే సమాధానం దొరికితే అదే తన గొప్పదనం అంటుంది’..  ‘పంచ భూతాలని శాసిస్తోందంటే ఇది సాధారణమైనది కాదు..  దీని ప్రభావం వల్ల మనం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం’.. ‘ఇప్పుడు ఈ రక్కసి క్రీడను ఆపాలంటే’.. అంటూ వచ్చిన వాయిస్ ఓవర్.. చూపించిన డైలాగ్స్‌ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ప్రవీణ్ కే బంగారి అందించిన విజువల్స్, శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బీజీఎం  అద్భుతంగా కుదిరాయి. టీజర్ చూస్తే  పాన్ ఇండియ సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉన్నట్లు అనిపిస్తుంది.  ఇక ఇందులో అంతరిక్షం నుంచి ఏదో ఒక అతీంద్రయ శక్తి ఉన్న ఉల్క, రాయి లాంటిది ఓ గ్రామంలో పడటం.. దాని ప్రభావంతో ఊర్లోని జనాలు చనిపోవడం, వింతగా ప్రవర్తించడం జరుగుతుంటుంది. దాన్ని ఛేదించేందుకు హీరో రావడం.. ఓ ఊరితో పోరాటం చేయడం వంటి ఆసక్తికరమైన అంశాలతో శంబాలను తెరకెక్కిస్తున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Updated Date - Jun 07 , 2025 | 02:05 PM