Mahesh Babu: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి సినిమా.. ఇప్పటి వరకూ రాలేదు
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:57 AM
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి సినిమా ఇప్పటి వరకూ రాలేదు. రామ్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందీ చిత్రం’ అని అన్నారు దర్శకుడు మహేశ్ బాబు పి.
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka) అంటే ప్రత్యేక అర్థముంది. అది సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. కన్నడలో కూడా అదే టైటిల్తో విడుదల చేస్తున్నాం. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ రాలేదు. రామ్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందీ చిత్రం’ అని అన్నారు దర్శకుడు మహేశ్ బాబు పి (Director Mahesh Babu P). రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బేనర్పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మించారు. సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మహేశ్ బాబు చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘రానా గారు ఉపేంద్రతో ఒక ఇంటర్వ్యూ చేయడం చూశాను. అందులో ఉపేంద్ర ( Upendra) ‘నేను బయటకంటే సినిమాలోనే రియల్ మనిషిని’ అని చెప్పారు. ఆ మాట నాకు చాలా కనెక్ట్ అయింది. అప్పుడే సూర్య అనే క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని అనిపించింది.
సూర్య పాత్ర కోసం ఉపేంద్రని సంప్రదించాము. ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. సూర్య క్యారెక్టర్లో స్టార్స్ అందరు కనిపిస్తారు. హీరోయిన్ భాగ్యశ్రీ (Bhagyashri Borse) పాత్ర కథలో చాలా కీలకం. ఒక జీవితాన్ని చూసినట్టుగా ఉంటుంది. వివేక్ మెర్విన్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. ‘చిన్ని గుండెలో..’ నా ఫెవరేట్ సాంగ్. ‘నువ్వుంటే చాలు..’ పాట కూడా నాకు చాలా ఇష్టం. రామ్ గారికి మ్యూజిక్పై మంచి అవగాహన ఉంది’ అని పేర్కొన్నారు.