8 Vasanthalu: ఇది మనసుతో.. చూడాల్సిన సినిమా

ABN , Publish Date - Jun 23 , 2025 | 08:41 PM

జూన్ 20న విడుదలైన 8 వసంతాలు సినిమా అందరినీ ఆకట్టుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

పాన్ ఇండియా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ లేటెస్ట్ హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్ 8 వసంతాలు (8 Vasanthalu). ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar) లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ నిర్మించారు. జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదలైన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా యాక్టర్ హను రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి టీం తో కలిసి పని చేయడం ఒక బ్లెస్సింగ్ గా భావిస్తున్నాను. సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది ఎప్పటికీ గర్వపడే సినిమా. ఇలాంటి సినిమాతో డెబ్యు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను'అన్నారు.

హీరోయిన్ అనంతిక మాట్లాడుతూ.. ఈ సినిమాకి ఆడియన్స్ చాలా ప్రేమ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లో సినిమా చూస్తున్నప్పుడు చాలా గ్రేట్ ఫుల్ గా అనిపించింది. ఇలాంటి మంచి టీంతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు ఫణి గారికి, మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్ యూ. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ పాత్ర నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది. సినిమాకి అందరూ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూడండి. మీ అందరికీ నచ్చుతుందన్నారు

యాక్టర్ రవి మాట్లాడుతూ... ప్రీమియర్స్ నుంచి ఇప్పటిదాకా 6 షోస్ చూశాను. ఆడియన్స్ నుంచి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. మా డైరెక్టర్ ఈ సినిమాకి ప్రేక్షకుడిలా వెళ్లి ప్రేమికుల బయటకి వస్తారని చెప్పారు. అది ఈ రోజు జరిగింది. చాలా స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసామని అడియన్స్ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. చూసినవాళ్ళు అందరూ చాలా బాగుందని చెప్తున్నారు. ఇంకా చూడాల్సిన వాళ్లు తప్పకుండా సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. డైరెక్షన్, విజువల్. మ్యూజిక్, ప్రొడక్షన్ పరంగా ఇది చాలా పెద్ద సినిమా. టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఇలాంటి బ్యూటిఫుల్ సినిమాని అందించినందుకు ఒక ప్రేక్షకుడిగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డైరెక్టర్ ఫణి గారికి థాంక్యూ. చాలా అద్భుతమైన సినిమా ఇచ్చారు. ఈ సినిమా జర్నీ ఇప్పుడే మొదలైంది. ఈ సినిమా చాలా ఏళ్లు పాటు గుర్తుండిపోతుంది. ఒక స్త్రీ పాత్రను ఎంత అద్భుతంగా చూపించవచ్చో చెప్పడానికి ఈ సినిమా ఒక రిఫరెన్స్ గా నిలుస్తుంది.'అన్నారు

డిఓపి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా చాలా థియేటర్స్ తిరిగాను. అన్ని హౌస్ ఫుల్ ఉన్నాయి. దాదాపు 20 సంవత్సరాలు అయింది ఇలాంటి సినిమా చూసి అని ఆడియన్స్ చెప్పారు. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఈ సినిమాకి వచ్చిన ప్రతి కాంప్లిమెంట్ చాలా ఆనందాన్నిచ్చింది. సినిమాని హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్ తో తీశాము. మైత్రి మూవీ మేకర్స్ చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు విజువల్స్ కి మంచి పేరు వస్తుందంటే..ఇదంతా టీం సపోర్టు. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అందరూ అంద హార్డ్ వర్క్ చేస్తేనే సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. జనాలు చాలా మెచ్చుకుంటున్నారు. ఇది ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా. తప్పకుండా థియేటర్స్ లోనే చూడండి'అన్నారు.

నటులు సంజన, కన్నా, కిరణ్‌లు మాట్లాడుతూ.. ఈ సినిమాలో మేము చేసిన క్యారెక్టర్ల‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్యారెక్టర్ లో నన్ను బిలీవ్ చేసిన డైరెక్టర్ ఫణి గారికి థాంక్యూ. మా ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్యూ. ఇదంతా టీం వర్క్. ఇలాంటి మంచి సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు.ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది మనసుతో చూడాల్సిన సినిమా. తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుందన్నారు

Updated Date - Jun 23 , 2025 | 08:41 PM