Vijay Antony: మర్డర్ మిస్టరీ - క్రైమ్ థ్రిల్లర్ గా మార్గన్

ABN , Publish Date - May 14 , 2025 | 06:01 PM

ప్రముఖ కథానాయకుడు విజయ్ ఆంటోని తాజా చిత్రం 'మార్గన్'. జూన్ 27న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇందులో విజయ్ మేనల్లుడే విలన్ గా నటిస్తుండటం విశేషం.

సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా మారి అప్రతిహతంగా దూసుకుపోతున్నాడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). అతని తాజా చిత్రం 'మార్గన్' (Maargan). ఈ మర్టర్ మిస్టరీ - క్రైమ్ థ్రిల్లర్ ను లియో జాన్ పాల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని విజయ్ ఆంటోని ఫిలిమ్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని సమర్పిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్ గా పరిచయం అవుతున్నాడు. వీరిద్దరి మధ్య పలు యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను సముతిరకని (Samuthirakani), మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్సిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి తదితరులు పోషిస్తున్నారు.


va 1234.jpgఇప్పటికే మేజర్ పార్ట్ పనులు పూర్తి చేసుకున్న 'మార్గన్' సినిమాను జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేవిధంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే హృద్యమైన కుటుంబ చిత్రంగా రానున్న దీనికి విజయ్ ఆంటోనీనే స్వయంగా స్వరాలను సమకూర్చాడు. అయితే... జూన్ 27వ తేదీనే మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా కూడా విడుదల కాబోతోంది.

Also Read: Pawan Kalyan: OG షూటింగ్ లో పవర్ స్టార్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 14 , 2025 | 06:01 PM