Rukmini Vasanth: ఆకాశాన్ని తాకుతున్న అమ్మడి రెమ్యునరేషన్

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:25 AM

ఇటు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తున్న రుక్మిణీ వసంత్ కు బన్నీ - అట్లీ మూవీలో సైతం ఛాన్స్ దొరికిందని వార్తలు వస్తున్నాయి. అందుకే కాబోలు అమ్మడు ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట.

ఆర్మీ ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth). ఆమె నటించిన కన్నడ చిత్రం 'సప్త సాగరాలు దాటి' (Saptha Sagaralu Daati) రెండు భాగాలుగా విడుదలైంది. ఈ హృద్యమైన ప్రేమకథా చిత్రం ఇతర భాషల్లోకీ డబ్ అయ్యింది. అలానే కొద్ది వారాల గ్యాప్ లోనే 'సప్త సాగరాలు దాటి' పార్ట్ వన్ అండ్ టు జనం ముందుకు వచ్చాయి. గాఢమైన ఈ ప్రేమకథా చిత్రంలో రుక్మిణీ వసంత్ తన పాత్ర కోసం ప్రాణం పెట్టేసింది. దాంతో ఈ సినిమా తర్వాత ఆమె డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. తెలుగుతో పాటు పాన్ ఇండియా మూవీస్ లోనూ రుక్మిణీ వసంత్ ను వెతుక్కుంటూ పాత్రలు వెళుతున్నాయి.


'సప్త సాగరాలు దాటి' మూవీ టైమ్ లోనే తెలుగులో నిఖిల్ (Nikhil) సినిమా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీకి రుక్మిణీ సైన్ చేసింది. కాస్తంత ఆలస్యంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పెద్దంత ప్రమోషన్స్ లేకుండానే జనం ముందుకు తీసుకొచ్చారు. దాంతో అది కాస్తా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. చాలామందికి నిఖిల్ అలాంటి ఓ సినిమాలో నటించాడని కానీ కన్నడ హీరోయిన్ రుక్మిణి ఆ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అని కానీ తెలియదు. అయితే చిత్రంగా ప్రశాంత్ నీల్ (Prasanth Neel)... ఎన్టీఆర్ (NTR) తో తెరకెక్కిస్తున్న 'డ్రాగన్' సినిమాలో రుక్మిణీ వసంత్ కు చోటుదక్కింది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం చాలామంది ప్రయత్నాలు చేశారు కానీ చివరికి అదృష్టం రుక్మిణిని వరించింది.

అలానే అల్లు అర్జున్ తో అట్లీ తెరకెక్కించబోతున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీలోనూ రుక్మిణీ వసంత్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని సమాచారం. అదే నిజమైతే... దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న రెండు బెస్ట్ మూవీస్ లో అమ్ముడు నటిస్తుండటం కెరీర్ పరంగా గ్రేట్ అఛీవ్ మెంట్. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తలంపుతో రుక్మిణీ వసంత్ ఇప్పుడు ఏకంగా సినిమాకు మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తోందట. మొన్నటి వరకూ సినిమాకు కోటి రూపాయలు మాత్రమే తీసుకున్న రుక్మీణీ ఇప్పుడు 3నుండి 4 కోట్ల వరకూ అడుగుతోందని అంటున్నారు. ఒకవేళ ఇటు ఎన్టీఆర్ మూవీ లేదా అల్లు అర్జున్ మూవీస్ లో ఒకటి హిట్ అయినా... రుక్మిణి కెరీర్ తారాజువ్వలా పైకి ఎగసిపోతుందని అంటున్నారు. ఇప్పటికే పరభాషా చిత్రాల నుండి వస్తున్న అవకాశాలతో కన్నడ చిత్రాలకు రుక్మిణీ ఎస్ చెప్పలేకపోతోందట. అమ్మడికి లభిస్తున్న డిమాండ్ చూస్తుంటే... అతి తక్కువ సమయంలోనే... నేషనల్ క్రష్ రష్మికా మందణ్ణ సరసన చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. చూద్దాం... ఏం జరుగుతుందో!!

Also Read: Aditi Rao Hydari: నిర్మాతల కోసం హీరామండీ లేడీస్ ఆటాపాటా

Also Read: Devika & Danny : దేవిక అండ్ డానీ వెబ్ సీరిస్ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 07 , 2025 | 11:27 AM