Kantara: Chapter 1: వరుసగా ముగ్గురు మరణం.. అసలు ఏం జరుగుతోంది..
ABN , Publish Date - Jun 13 , 2025 | 06:43 PM
రిషబ్ శెట్టి (Rishab Shetty) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న కాంతారా 2’ (Kantara 2) చిత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికి ఈ చిత్రం షూటింగ్లో రెండుసార్లు వరుసగా ప్రమాదాలు జరిగి వివాదాల్లో నిలిచింది
రిషబ్ శెట్టి (Rishab Shetty) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న కాంతారా 2’ (Kantara 2) చిత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికి ఈ చిత్రం షూటింగ్లో రెండుసార్లు వరుసగా ప్రమాదాలు జరిగి వివాదాల్లో నిలిచింది. అలా ఈ చిత్రానికి ఏదోలా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇందులో నటిస్తున్న నటులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఇప్పటికే కపిల్, రాకేష్ జుపారి అనే ఇద్దరు మృతి చెందగా.. తాజాగా మరో నటుడు విజు వికె ఛాతి నొప్పితో ప్రాణాలు కోల్పోయాడు. 55 ఏళ్ల వయసు కలిగిన ఈ నటుడు షూటింగ్ కోసం బస చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చినట్లు చిత్ర బృందానికి తెలియజేయగా విజును అంబులెన్స్లో తీర్థహళ్లిలోని జెసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో తుదిశ్వాస విడిచారు. వరుసగా ముగురు నటుటు మరణించడంతో చిత్ర యూనిట్ విషాదంలో మునిగిపోయింది.
ప్రస్తుతం కాంతార 2 షూటింగ్కు బ్రేక్ పడినట్లు తెలిసింది. దీంతో చిత్ర బృందం ఎందుకిలా జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. (Kantara: Chapter 1)
2022లో చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుని నేషనల్ అవార్డ్ గెలుచుకుంది కాంతార సినిమా. ఈ చిత్రానికి ప్రీక్వెల్గా 'కాంతార చాప్టర్ 1’ వస్తోంది. హోంబలే ఫిల్మ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ రెండో తేదిన విడుదల చేయనున్నారు.