Rajanikanth: మనవడి జీవితంలో మొదటి మైలురాయి..
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:31 PM
తమిళ హీరో ధనుష్(Dhanush), రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య Aishwarya Rajinikanth) గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
తమిళ హీరో ధనుష్(Dhanush), రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య Aishwarya Rajinikanth) గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. తమ తనయుడు యాత్ర గ్రాడ్యుయేషన్ డేలో వీరు పాల్గొన్నారు. తనయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ధనుష్ ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘యాత్ర.. తల్లిదండ్రులుగా ఈరోజు మేమిద్దరం ఎంతో గర్వపడుతున్నాం’’ అని క్యాప్షన్ రాశారు. ఈ ఫొటోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చాలా రోజుల తర్వాత మీ ఇద్దరినీ ఇలా ఒకే ఫ్రేమ్లో చూడటం సంతోషంగా ఉంది’’ అని కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు, ఇదే ఫొటోని రజనీకాంత్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘‘నా మనవడు జీవితంలో మొదటి మైలురాయి దాటాడు. కంగ్రాట్స్ యాత్ర కన్నా’’ అని రాసుకొచ్చారు. ధనుష్ - ఐశ్వర్య 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు (లింగ, యాత్ర) ఉన్నారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామంటూ 2022 జనవరిలో ఈ జంట ప్రకటించింది. నవంబర్ 2024లో కోర్టు విడాకులు మంజూరు చేసింది.