Kantara: Chapter 1: కాంతార-2 సెట్లో మరో ప్రమాదం.. తరచూ ఎందుకిలా..
ABN , Publish Date - Jun 15 , 2025 | 01:03 PM
'కాంతార ఛాప్టర్ -1’ చిత్రానికి ఏదో అయింది. తరచూ ఈ సినిమా సెట్లో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతోంది. చిత్రీకరణ సమయంలో వరుస ప్రమాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది.
'కాంతార ఛాప్టర్ -1’ చిత్రానికి ఏదో అయింది. తరచూ ఈ సినిమా సెట్లో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతోంది. చిత్రీకరణ సమయంలో వరుస ప్రమాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ టీమ్ త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. ప్రస్తుతం దీని చిత్రీకరణ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతోంది. శనివారం సాయంత్రం 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు రిషబ్శెట్టి కూడా దానిలో ఉన్నారు. అయితే వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో కెమెరాతో పాటు పలు పరికరాలు నీటి పాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
2022లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్గా కాంతార ఛాప్టర్ 1 వస్తోంది. రిషబ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది నవంబర్లో జూనియర్ ఆర్టిస్ట్లు ప్రయాణిస్తున్న వ్యాన్కు ప్రమాదం చోటు చేసుకుంది. మేలో కపిల్ అనే నటుడు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందాడు. అదే నెలలో రాకేశ్ అనే మరో నటుడు గుండెపోటుతో కన్నుమూశాడు. నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ (43) సైతం గుండెపోటుతో మృతి చెందినట్లు శనివారం వార్తలు వచ్చాయి. అయితే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటనే విషయంపై టీమ్ ఆలోచనలతో పడ్డారు.