Producer Lohith: తిరుమలలో శ్రీవారి సేవలో 'జన నాయగన్' నిర్మాత
ABN , Publish Date - Jun 24 , 2025 | 10:20 PM
కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాతల్లో ఒకరైన ఎన్.కె.లోహిత్ శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో స్వామివారి సన్నిధిలో విశేష పూజలు జరిపారు.
కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నిర్మాతల్లో ఒకరైన ఎన్.కె.లోహిత్ (NK lohith) శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో స్వామివారి సన్నిధిలో విశేష పూజలు జరిపారు. భక్తిశ్రద్ధలతో తన మొక్కులు చెల్లించుకుని, శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు లోహిత్ను పట్టు వస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు లోహిత్ సన్నిహితులు కూడా పాల్గొన్నారు. స్వామివారి దర్శనం తనకు అపార ఆధ్యాత్మిక శాంతిని, ఆనందాన్ని కలిగించిందని లోహిత్ తెలిపారు. తన రాబోయే చిత్ర ప్రాజెక్టుల విజయం కోసం స్వామి ఆశీస్సులు కోరినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రస్థానంలో శ్రీవారి కృపతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం లోహిత్ దళపతి విజయ్ ఆఖరి సినిమా 'జన నాయగన్' (Jana nayagan) సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.