Ilayaraja: ఇళయరాజా మనవడు తొలి భక్తి పాట రిలీజ్‌

ABN , Publish Date - Jun 10 , 2025 | 02:19 PM

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఎవరూ అధిరోహించలేని స్థానాన్ని దక్కించుకున్న ‘ఇసైఙ్ఞాని’ ఇళయరాజా (Ilayaraja) కుటుంబం నుంచి మరో సంగీత దర్శకుడు వచ్చారు.

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఎవరూ అధిరోహించలేని స్థానాన్ని దక్కించుకున్న ‘ఇసైఙ్ఞాని’ ఇళయరాజా (Ilayaraja) కుటుంబం నుంచి మరో సంగీత దర్శకుడు వచ్చారు. ఇళయరాజా పెద్ద కుమారుడు కార్తీక్‌ రాజా తనయుడు యధీశ్వరన్‌ (Yatheeswarar) సంగీత దర్శకుడిగా అవతారమెత్తారు. తన తొలిపాటను శ్రీ అరుణచలేశ్వర స్వామిపై (Arunachaleswara) రూపొందించి తాజాగా రిలీజ్‌ చేశారు. ఇళయరాజా తరహాలోనే పరమశివుడిని, రమణ మహర్షిని అమితంగా ఆరాధించే యధీశ్వరన్‌... తన తొలి భక్తి పాటను తిరువణ్ణామలై లోని రమణ మహర్షి ఆశ్రమంలోనే, ఆ ఆశ్రమ నిర్వాహకులతో విడుదల చేయించడం గమనార్హం. 

దీనిపై యధీశ్వరన్‌ మాట్లాడుతూ, ‘నాకు బాల్యం నుంచే సంగీతంపై మక్కువ. నా తొలి పాట భక్తి గీతం ఉండాలని భావించాను. తాత (ఇళయరాజా) కొన్ని సలహాలిచ్చారు. గేయ రచనలో డాడీ సహకరించారు. తాత, డాడీ, చిన్నాన్న (యువన్‌ శంకర్‌ రాజా), అత్త (దివంగత భవధారణి, ఇళయరాజా కుమార్తె) తరహాలోనే సినీ సంగీతంలో రాణించాలని ఉంది. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను’ అన్నారు. కాగా, ఇండియన్‌ సినిమాలో ఒకే కుటుంబం నుంచి నలుగురు సంగీత దర్శకులు ఉండటం చాలా అరుదు. అది ఇళయరాజా ఫ్యామిలీకే వర్తించింది.  

Updated Date - Jun 10 , 2025 | 03:10 PM