Ilayaraja - Mani ratnam: ఒకే రోజు ఇళయమణి బర్త్ డే .. ఎందుకంటే

ABN , Publish Date - Jun 02 , 2025 | 07:14 PM

ఇండియన్ సినీ ఫ్యాన్స్ ను ఆ ఇద్దరూ భలేగా అలరించారు... ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ గా- మరొకరు డైరెక్టర్ గా తమ సినిమాలతో మెస్మరైజ్ చేశారు..

ఇండియన్ సినీ ఫ్యాన్స్ ను ఆ ఇద్దరూ భలేగా అలరించారు... ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ గా- మరొకరు డైరెక్టర్ గా తమ సినిమాలతో మెస్మరైజ్ చేశారు... ఈ ఇద్దరూ జూన్ 2వ తేదీన బర్త్ డే జరుపుకున్నారు... ఆ ఇద్దరు ఎవరంటే - ఇళయరాజా, మణిరత్నం... వారి పుట్టినరోజున చిత్రసీమలో వారిద్దరూ కలసి సాగిన తీరును గుర్తు చేసుకుందాం...

పదింట పదనిసల పయనం!
 
ఇళయరాజా, మణిరత్నం ఇద్దరూ జూన్ 2వ తేదీన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటారు... నిజానికి ఇళయరాజా 1943 జూన్ 3న జన్మించారు... అయితే తనకు 'ఇసైజ్ఞాని' అని బిరుదునిచ్చిన ఆ నాటి ముఖ్యమంత్రి కరుణానిధి పుట్టినరోజు  కూడా జూన్ 3వ తేదీనే...  కరుణానిధిని గౌరవిస్తూ ఇళయరాజా తన బర్త్ డేను ఓ రోజు ముందు అంటే జూన్ 2న జరుపుకోసాగారు... నాటి నుంచీ నేటి దాకా అదే తంతు సాగుతోంది... ఇక మణిరత్నం 1956 జూన్ 2న జన్మించారు... మణిరత్నం మాతృభాష తమిళమైనా ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం 'పల్లవి - అనుపల్లవి'  కన్నడ సినిమా, ఇక ఆయన రెండో సినిమా 'ఉనరూ' మళయాళ మూవీ... ఈ రెండు సినిమాలకూ ఇళయరాజా సంగీతం సమకూర్చారు... ఆ మాటకొస్తే మణిరత్నం మొదటి పది చిత్రాలకు ఇళయరాజానే స్వరకల్పన చేశారు... డైరెక్టర్ గా మణికి 'మౌనరాగం'తో తొలి బిగ్ హిట్ దక్కింది... ఈ సినిమా తెలుగులోనూ అనువాదమై ఇళయరాజా బాణీల్లో అలరించింది.



Mani-2.jpg
తెలుగులో ఇళయ-మణి!

ఆ రోజుల్లో ఇళయరాజా ఓ సినిమాకు స్వరకల్పన చేస్తున్నారని తెలియగానే, అందులో ఆయన ఎలాంటి ప్రయోగాలు చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే వారు... ఇళయరాజా సైతం ఫ్యాన్స్ ను నిరాశ పరచకుండా తాను కంపోజ్ చేసే మూవీస్ లో కనీసం రెండు పాటలతోనైనా అలరించేవారు... ఇక క్రియేటర్స్ అనదగ్గ డైరెక్టర్స్  తోడయితే మరింతగా విజృంభించేవారు ఇళయరాజా... ఆ తీరున మణిరత్నం కాంబోలో తాను స్వరపరచిన పాటలతో ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు రాజా... తెలుగులో మణిరత్నం రూపొందించిన ఏకైక చిత్రం 'గీతాంజలి'కి ఇళయరాజా బాణీలే ప్రాణం పోశాయంటే అతిశయోక్తి కాదు...

మరపురాని మధురం...

ఇళయరాజా - మణిరత్నం కాంబోలో రూపొందిన పదవ చిత్రం 'దళపతి'...  రజనీకాంత్, మమ్ముట్టి హీరోలుగా రూపొందిన ఈ మూవీనే వారిద్దరి కాంబోలో వచ్చిన చివరి సినిమా కావడం గమనార్హం!... ఇందులో ఏసుదాస్, ఎస్పీ బాలుతో ఇళయరాజా బాణీల్లో రూపొందిన గీతం ఈ నాటికీ తమిళ, తెలుగు జనాన్ని అలరిస్తూనే ఉంది... 'దళపతి' తరువాత ఏమైందో ఏమో మణిరత్నం, ఎ.ఆర్.రహమాన్ ను తన 'రోజా'తో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేశారు... అప్పటి నుంచీ ఇప్పటి దాకా రహమాన్ బాణీలతోనే మణి సాగుతూ ఉండడం విశేషం... అయితే ఇళయరాజా- మణి కాంబోలో వచ్చిన సాంగ్స్ ను ఎవ్వరూ మరచిపోలేదు... అదీ విశేషం!

Updated Date - Jun 02 , 2025 | 07:14 PM