Archana Singh: ‘ఎవరెస్ట్ బేస్ క్యాంప్’.. నటి సాహస యాత్ర..
ABN , Publish Date - May 30 , 2025 | 04:58 PM
అర్చనా సింగ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ కన్నడ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో ఆమె సుపరిచిత నటి.
అర్చనా సింగ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ కన్నడ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో ఆమె సుపరిచిత నటి. కన్నడలో కాంతామణిగా పేరొందిన అర్చనా, ఇటీవల హిమాలయాల్లోని ‘ఎవరెస్ట్ బేస్ క్యాంప్’ సాహస యాత్ర చేశారు. ఎం.బి.ఏ పూర్తి చేసిన అర్చన, సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే, ‘విప్రో’, ‘ఐ.టి.సి. గ్రూప్ ఆఫ్ హోటల్స్’, ‘కింగ్ ఫిషర్’, ‘జెట్ ఎయిర్లైన్స్’ వంటి సంస్థల్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. కన్నడ, తమిళ చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘దమయంతి - కౌశిక్ వర్మ’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘‘మై ఫాదర్ - మై హీరో’’ అనే చిత్రంతో మాలీవుడ్కు పరిచయం కాబోతుంది. శాస్ర్తీయ నృత్యంలో నైపుణ్యం కలిగిన అర్చనా, సమయం దొరికినప్పుడల్లా నృత్య ప్రదర్శనలు కూడా ఇస్తుంది. ఇటీవల తన ‘ఎవరెస్ట్ బేస్ క్యాంప్’ టూర్ కోసం మాట్లాడుతూ ునా కెరీర్ ప్రారంభంలో చేసిన ఉద్యోగాలు, దక్షిణాది సినిమాల్లో నటించడం నాకు ఎంత ఉత్సాహాన్నిచ్చాయో, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర అంతకంటే ఎక్కువ ఉత్తేజాన్నిచ్చింది. జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పాన్ని, ప్రేరణను ఈ యాత్ర నాలో నింపింది. నాలో దాగి ఉన్న భయం, బెరుకును ఈ సాహసం తుడిచిపెట్టింది. ఈ అనుభవాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం’’ అని అన్నారు.