Nadigar Sangam: నడిగర్‌ సంఘం పేరుతో  రూ.40 లక్షల మోసం !

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:29 PM

దక్షిణ భారత నడిగర్‌ సంఘం (Nadigar sangam) పేరుతో స్కాం జరిగింది.  నకిలీ సంస్థ నడిపి, ఓ ముగ్గురు రూ.40 లక్షలు మోసం చేసారు. 


టి.నగర్‌లోని దక్షిణ భారత నడిగర్‌ సంఘం (Nadigar sangam) పేరుతో నకిలీ సంస్థ నడిపి, రూ.40 లక్షలు మోసం చేసిన సంఘ మాజీ మేనేజర్‌ సహా ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. నడిగర్‌ సంఘం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘ మాజీ మేనేజర్‌ బాలమురుగన్‌, శంకర్‌బాబు, సతీష్ కుమార్‌లను విచారించగా పలు వాస్తవాలు వెలుగు చూశాయి.

‘ఎవర్‌ గ్రీన్‌ మీడియా’ అనే సంస్థను దక్షిణ భారత నడిగర్‌ సంఘం నిర్వహిస్తోందని సంఘ సభ్యులను నమ్మించి వసూలు చేసిన రూ.40 లక్షలకు పైగా కాజేసినట్టు విచారణలో తెలిసింది. ఈ సంఘటన తమిళ చిత్రరంగంలో కలకలం రేపింది.

Updated Date - Jun 14 , 2025 | 01:29 PM