గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు అరుదైన గౌరవం దక్కింది. లండన్లో ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం శుక్రవారం లాంచ్ చేశారు. ఆయన పెట్ డాగ్ రైమ్తో కూడిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా లండన్లో చరణ్ ఫ్యాన్స్ సందడి చేశారు.