ఈషా యోగా సెంటర్‌లో గురుపూర్ణిమ సెలెబ్రేషన్స్..

ABN, Publish Date - Jul 10 , 2025 | 08:16 PM

ఈషా యోగా సెంటర్‌లో గురుపూర్ణిమ సెలెబ్రేషన్స్.. 1/10

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకులకు,ఆషాఢ పూర్ణిమ, గురుపూర్ణిమ అనేది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. ఆది యోగి మొదట ఆది గురువుగా మారి తన ఏడుగురు శిష్యులైన సప్తరుషులకు యోగ శాస్త్రాలను అందించిన పవిత్రమైన రోజు, ఇది భారతదేశంలో పవిత్రమైన గురుశిష్య పరంపర ప్రారంభాన్నిసూచిస్తుంది.

ఈషా యోగా సెంటర్‌లో గురుపూర్ణిమ సెలెబ్రేషన్స్.. 2/10

అప్పటినుండి, గురుపూర్ణిమ మన గురువులకు కృతజ్ఞతలు తెలియజేసే ఒక గొప్ప అవకాశంగా ఉంటూ వస్తోంది. దీన్నిభారతదేశమంతటా భక్తితో నిర్వహించుకుంటారు. 

ఈషా యోగా సెంటర్‌లో గురుపూర్ణిమ సెలెబ్రేషన్స్.. 3/10

కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌, సద్గురు ఆశ్రమంలో,మెడిటేటర్లు,  ఆశ్రమవాసులు జూలై 10న గురు పూర్ణిమని  ఘనంగా నిర్వహించారు. 

ఈషా యోగా సెంటర్‌లో గురుపూర్ణిమ సెలెబ్రేషన్స్.. 4/10

సద్గురు అర్పణం –గురుపూర్ణిమ రోజు ఉద్యాపన ఈ సంవత్సరం, మొదటిసారిగా,సద్గురు అర్పణం అనే ఏడు రోజుల ఆన్‌లైన్ సాధనని అందిస్తున్నారు,

ఈషా యోగా సెంటర్‌లో గురుపూర్ణిమ సెలెబ్రేషన్స్.. 5/10

ఇది పవిత్రమైన గురు పూర్ణిమ రోజున ముగుస్తుంది.ఇందులో పాల్గొనేవారు ప్రత్యేకమైన గురు పూర్ణిమ మంత్రం, ధ్యాన లింగానికి పవిత్రమైన అభిషేకంతో ముగిస్తారు. 

ఈషా యోగా సెంటర్‌లో గురుపూర్ణిమ సెలెబ్రేషన్స్.. 6/10

భక్తులుధ్యాన లింగానికి  క్షీరార్పణం, జలార్పణం చేశారు.  ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజు ధ్యాన లింగానికి క్షీరార్పణం, జలార్పణం చేస్తారు.

ఈషా యోగా సెంటర్‌లో గురుపూర్ణిమ సెలెబ్రేషన్స్.. 7/10

ఈ శక్తితో అనుసంధానమై ధ్యానలింగ అనుగ్రహాన్ని పొందుతారు. ఇదిగురు పూర్ణిమ రోజున -భక్తులు గురువుతో తమ అనుబంధాన్నిమరింత బలోపేతం చేయడానికి పవిత్రమైన అవకాశంగా భావిస్తారు.  

ఈషా యోగా సెంటర్‌లో గురుపూర్ణిమ సెలెబ్రేషన్స్.. 8/10

ఈసారి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ సెంటర్‌లో జరిగే  గురుపూర్ణిమ ప్రత్యేకత ఏంటంటే.. చాలాకాలంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న సద్గురుతో ప్రత్యేక సత్సంగం. సాయంత్రం7 గంటలనుండి ప్రారంభమైయ్యే ఈ సత్సంగంలో సద్గురుచే శక్తివంతమైన ధ్యానం ఉంటుంది.

ఈషా యోగా సెంటర్‌లో గురుపూర్ణిమ సెలెబ్రేషన్స్.. 9/10

ఈ కార్యక్రమంలో ఈశా సంగీత బృందం సౌండ్స్ ఆఫ్ ఈశాతో కలిసి ప్రసిద్ధ కళాకారుల అద్భుతమైన ప్రదర్శనలు, మోహిత్ చౌహన్, రామ్ మిరియాల, పార్థివ్ గోహిల్ మరియు స్వగత్ రాథోడ్ వంటి ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు జరగనున్నాయి. ప్రసిద్ధ కళాకారులప్రదర్శనలు జరగనున్నాయి.

ఈషా యోగా సెంటర్‌లో గురుపూర్ణిమ సెలెబ్రేషన్స్.. 10/10

ఉత్సాహభరితమైన ప్రపంచ స్థాయి ప్రదర్శన అందిచేందుకు త్రినిదాదియన్సోకా కింగ్ మాచెల్ మాంటానోకూడా ఇందులో పాల్గొంటున్నారు. వ్యక్తిగతంగా హాజరు కాలేని వారు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానల్స్ లేదా ఎంపిక చేసిన ఈశా స్థానిక కేంద్రాలలో గురు పూర్ణిమ సత్సంగం లైవ్‌స్ట్రీమ్‌లో చేరవచ్చు.

Updated at - Jul 10 , 2025 | 08:45 PM