Garudan Review: భైరవం మాతృక.. గరుడన్ ఓటీటీ మూవీ రివ్యూ!
ABN , Publish Date - May 29 , 2025 | 10:01 PM
గత సంవత్సరం అనామకంగా, చిన్న చిత్రంగా తమిళనాట థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం గరుడన్.
గత సంవత్సరం అనామకంగా, చిన్న చిత్రంగా తమిళనాట థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం గరుడన్ (Garudan). అప్పటివరకు కమెడియన్గా టాప్లో దూసుకువెళుతున్న సూరి (Soori)హీరోగా రెండో ప్రయత్నంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకుముందు ధనుష్, శివ కార్తికేయన్లతో కలిసి రెండేసి సినిమాలను డైరెక్ట్ చేసిన దురైస్వామి (R. S. Durai Senthilkumar) దర్శకత్వం వహించాడు. మరో ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) ఓ నిర్మాతగా వ్యవహరించాడు. గత సంవత్సరం సరిగ్గా మే31న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకాదరణ పొందింది. రూ. 10 కోట్ల లోపు బడ్జెట్లో రూపొంది రూ. 50 కోట్లకేపైగా వసూల్లు సాధించింది. ఉన్ని ముకుందన్ (Unni Mukundan), శశి కుమార్ (M. Sasikumar) కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే.. కరుణ, ఆది బాల్యం నుంచి ప్రాణ స్నేహితులు. ఓ సందర్భంలో కరుణను సొక్కన్ అనే అనాథ ప్రమాదం నుంచి కాపాడుతాడు. దీంతో కరుణ సొక్కన్ను తన నానమ్మకు చెప్పి చేరదీస్తాడు. అప్పటి నుంచి ఈ ముగ్గురు ఎక్కడికెళ్లినా కలిసే ఉంటారు. ఆపై సొక్కన్ కరుణ, ఆదిలకు సహాకుడిగా ఉంటూ వారిపై మాట పడనీయకుండా ముఖ్యంగా కరుణ అంటే ప్రాణమిచ్చేలా నమ్మిన బంటులా ఉంటాడు. కరుణ ఇటుక బట్టీ వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటాడు. ఆదికి కొన్ని లారీలు ఉంటాయి. అంతేగాక వీరిద్దరు అగ్రామంలోని అమ్మ వారి ఆలయం ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ ఊర్లో పెద్ద మనుషులుగా చెలామణి అవుతుంటారు. అయితే.. ఈ నిమోజకవర్గానికే చెందిన రెవిన్యూ మంత్రి గుడికి సంబంధించిన అసైన్ట్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చూస్తుంటాడు. అందుకు సంబంధించిన పత్రాలు ఆలయం ఆధ్వర్యంలో ఉన్నాయని తెలుసుకుంటారు. అదే సమయంలో అప్పటివరకు గుడి పెద్దగా ఉన్న కరుణ నానమ్మ చనిపోవడంతో ఆ పోస్టు కోసం మంత్రి బంధువు నాగరాజు ప్రయత్నం చేసినా కరుణ, ఆదిల సపోర్ట్తో సొక్కన్ ఆ ఆలయానికి పెద్ద అవుతాడు. ఆది నచ్చని నాగరాజు కరుణ భార్య, బావ మరిదిలకు డబ్బు ఆశ చూపి రెచ్చగొడతాడు. అదే కోవలో గతంలో ఆది వళ్ల ఇబ్బంది పడ్డ వైరివేల్ కరుణ, ఆదిల మధ్య స్నేహాన్ని చెడగొట్టేందుకు ఫ్లాన్ చేస్తారు. ఈక్రమంలో గుడికి సంబంధించిన నగలు మాయం కావడంతో కరుణపై కేసు అవుతుంది. అందుకు ఆది తన ఆస్తిని అమ్మి కరుణను కేసు నుంచి బయటకు తీసుకు వస్తాడు. తర్వాత ఇదంతా కుట్ర అని కరుణ హస్తం కూడా ఉందని తెలుస్తుంది.
ఆపై ఊర్లో గుడి వద్ద జరిగే ఉత్సవాల్లో ఆదిని చంపాలని నాగరాజ్, వెట్రీవేల్ ఫ్లాన్ చేస్తారు, అందుకు కరుణ సాయం చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో సొక్కన్ రంగంలోకి దిగి వాళ్ల చేతులు నరికేస్తాడు. దీంతో సొక్కన్ ఉన్నంత సేపు ఆదిని టచ్ చేయలేమని భావించిన కరుణ ఓ రోజు సొక్కన్ను దూర ప్రాంతాఇనికి పంపి ఆదిని తోటలో భోజనానికి పిలిచి మనుషులతో చంపేస్తారు. అయితే కరుణకు నమ్మిన బంటు అయిన సొక్కన్ ఏం చేయలేక పోతాడు. కొంతకాలానికి ఆది కుమారుడు ప్రతీకారం తీర్చుకొవాలని కరుణను చంపేందుకు తిరుగతూ అనుకోకుండా కరుణ ఇంట్లో చిక్కుకు పోతాడు. దీంతో సొక్కన్ అ అబ్బాయిని రక్షించేందుకు పూనుకుంటాడు. ఈక్రమంలో ఆదిని హత్యలో కీలకంగా ఉన్న నాగరాజ్, ఇన్స్పెక్టర్లను చంపి స్టేషన్లో లొంగి పోతాడు. ఆపై కరుణ పాత వ్యాపార భాగస్వామి కరుణ కుట్రలన్నింటినీ బయట పెట్టడంతో సొక్కన్ స్టేషన్ నుంచి తప్పించుకుంటాడు. విషయం తెలుసుకున్న కరుణ సొక్కన్పై దాడి చేస్తాడు. అతని ప్రేయసిని సజీవ దహానం చేయాలని చూస్తాడు. ఇక ఆగ్రహం పట్టలేకపోయిన సొక్కన్ కరుణను చంపేయడంతో సినిమా ముగుస్తుంది.
ఇప్పుడు ఈ సినిమానే తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohith) కాంబోలో భైరవం (Bhairavam)గా తెరకెక్కిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమాయకుడైన సొక్కన్ పాత్రలో బెల్లంకొండ, కరుణ పాత్రలో మంచు మనోజ్, ఆదిగా రోహిత్ నటిస్తున్నారు. అయితే తమిళ వెర్షన్ సినిమాను ఉన్నది ఉన్నట్లు కాకుంగా తెలుగు వెర్షన్లో చాలా మర్పులు చేసినట్లు మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. సినిమా విడుదలైతే గానీ ఏం మార్పులు చేశారనేది తెలియదు. మరో విషయమేమంటే తమిళ వెర్షన్ గత ఏడాది మే31న విడుదల కాగా ఇప్పుడు తెలుగు వర్షన్ మే30నే విడుదల కానుండడం యాదృశ్చికం. ఇదిలాఉండగా ఈ సినిమా ప్రస్తుతం తెలుగు తప్ప ఇతర సౌత్ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.