Singer: గాయని రజియా సుల్తానా కన్నుమూత

ABN , Publish Date - May 31 , 2025 | 06:20 PM

భాగ్యనగర్ సంగీత ప్రియులకు సుపరిచితురాలైన గాయని రజియా సుల్తానా అనారోగ్యంతో కెనడాలో తుదిశ్వాస విడిచారు. ఆమెను అభిమానులు ప్రేమగా 'హైదరాబాద్ లతా మంగేష్కర్' అని పిలుచుకునేవారు.

'హైదరాబాద్ లత మంగేష్కర్' (Lata Mangeshkar) గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే ప్రముఖ గాయని రజియా సుల్తానా (53) (Razia Sultana) మే 31వ తేదీ గుండెపోటుతో కన్నుమూశారు. కెనడా లో స్టేజ్ సంగీత విభావరి నిమిత్తం ఆమె వెళ్లారు. టొరంటోలో గుండెపోటుకు గురై ఆమె కుప్పకూలారని, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారని సన్నిహితులు తెలిపారు. ఆమెకు భర్త, కుమార్తె ఉన్నారు. దాంతో హాకాభవన్ దగ్గరలో వున్న వారి అపార్ట్మెంట్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.


rs123.jpg

రవీంద్రభారతి (Ravindra Bharathi) లో గత మూడు దశాబ్దాలుగా వందలాది సంగీత విభావరిలలో రజియా సుల్తానా హిందీ సినిమా పాటలతో అలరించారు. ప్రతి నెల రెండో శనివారం గాంధీ భవన్ ఆడిటోరియంలో, ప్రతి మూడో శనివారం గన్ ఫౌండ్రి మీడియా ప్లస్ లో, ప్రతి మొదటి శనివారం తన ఇంట్లో సంగీత విభావరి, గజల్ నైట్స్ ను ఆమె నిర్వహిస్తూ వచ్చారు. రెండేళ్ల క్రితం గుండెపోటుకు గురి కాగా వైద్యులు స్టెంట్ వేశారు. తిరిగి శనివారం గుండెపోటు రావడంతో టొరంటోలో చనిపోయారు. మే 31వ తేదీ సాయంత్రమ టొరంటోలోనే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మంచి స్వరాన్ని అంతకు మించిన మంచి స్నేహితురాలిని కోల్పోయామంటూ ఆమె సన్నిహితులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - May 31 , 2025 | 06:20 PM