ఏడవ శతాబ్దపు కథతో..

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:15 AM

హీరో గోపీచంద్‌ కొత్త చిత్రం షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘ఘాజీ’, ‘ఐబీ 71’, ‘అంతరిక్షం’ వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన సంకల్ప్‌ రెడ్డి...

హీరో గోపీచంద్‌ కొత్త చిత్రం షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘ఘాజీ’, ‘ఐబీ 71’, ‘అంతరిక్షం’ వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన సంకల్ప్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఏడవ శతాబ్దం నేపథ్యంగా రూపుదిద్దుకునే ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన, ఇంకా అన్వేషించని చారిత్రక సంఘటనను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామనీ, ఇందులో గోపీచంద్‌ ఇంతవరకూ పోషించని ఓ అద్భుతమైన పాత్ర చేస్తున్నారనీ దర్శకుడు సంకల్పరెడ్డి చెప్పారు. విజువల్‌ వండర్‌గా, భారీ స్థాయిలో రూపుదిద్దుకొనే ఈ చారిత్రక చిత్రానికి టాప్‌ టెక్నిషియన్లు పని చేస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీనీ, చిన్నా ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ను, పృథ్వీ యాక్షన్‌ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. సురేశ్‌బాబు, ప్రకాశ్‌ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు.

Updated Date - Mar 11 , 2025 | 04:15 AM