వైవిధ్యమైన కథతో..
ABN , Publish Date - Jan 06 , 2025 | 06:18 AM
లోహిత్ కల్యాణ్, రాజేశ్ కుంచాడా, జోషిత్ రాజ్కుమార్, కైలాష్ వేలాయుధన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి దొంగలు’. లోకేశ్ రనల్ హిటాసో దర్శకత్వంలో నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు...
లోహిత్ కల్యాణ్, రాజేశ్ కుంచాడా, జోషిత్ రాజ్కుమార్, కైలాష్ వేలాయుధన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి దొంగలు’. లోకేశ్ రనల్ హిటాసో దర్శకత్వంలో నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు లోకేశ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అందరిని మెప్పిస్తుందనే నమ్మకముంది. వైవిధ్యమైన కథతో తెరకెక్కిన సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా మీ అంచనాలకు మించి ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమిది’’ అని నిర్మాత బంగారునాయుడు అన్నారు.