విశాల్‌కు మద్రాసు హైకోర్టు ఆదేశం

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:20 AM

లైకా సంస్థకు రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో చెల్లించాలని నటుడు విశాల్‌ను మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. ‘విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ’ చిత్ర నిర్మాణ సంస్థ కోసం సినీ ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ నుంచి...

  • రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో చెల్లించండి

లైకా సంస్థకు రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో చెల్లించాలని నటుడు విశాల్‌ను మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. ‘విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ’ చిత్ర నిర్మాణ సంస్థ కోసం సినీ ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ నుంచి విశాల్‌ రూ.21.29 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ రుణాన్ని వివిధ కారణాలతో ‘లైకా ప్రొడక్షన్‌’ సంస్థ ఫైనాన్షియర్‌కు చెల్లించింది. అయితే లైకా సంస్థకు విశాల్‌ ఆ రుణం తిరిగి చెల్లించలేదు. దాంతో ఆ రుణం పూర్తిగా చెల్లించే వరకు విశాల్‌ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించే అన్ని చిత్రాల హక్కులు లైకా సంస్థకు చెందేలా ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందాన్ని అతిక్రమించి, విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ చిత్రాలు విడుదల చేస్తోందని, రుణం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ గతంలో లైకా సంస్థ నిర్వాహకులు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు లైకా సంస్థకు రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో చెల్లించాలని విశాల్‌ను ఆదేశించింది.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 06 , 2025 | 05:20 AM