యజ్ఞం దర్శకుడు ఇక లేరు

ABN , Publish Date - Jun 12 , 2025 | 06:06 AM

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు ఏ. ఎస్‌ రవికుమార్‌చౌదరి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు ఏ. ఎస్‌ రవికుమార్‌చౌదరి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య నాగబిందు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2001లో ఆకాశ్‌ హీరోగా నటించిన ‘మనసుతో’ చిత్రంతో రవికుమార్‌ చౌదరి దర్శకుడిగా పరిచయమయ్యారు. గోపీచంద్‌ను హీరోగా ఆయన తెరకెక్కించిన ‘యజ్ఞం’ చిత్రం వారిద్దరికీ ఇండస్ట్రీలో బ్రేక్‌ ఇచ్చింది. సాయిదుర్గాతేజ్‌తో తెరకెక్కించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. బాలకృష్ణతో ‘వీరభద్ర’, నితిన్‌తో ‘ఆటాడిస్తా’ చిత్రాలను తెరకెక్కించినా అవి విజయవంతం అవ్వలేదు. రాజ్‌తరుణ్‌తో తెరకెక్కించిన ‘తిరగబడరా సామి’ రవికుమార్‌ ఆఖరిచిత్రం.

Updated Date - Jun 12 , 2025 | 06:06 AM