ఆ నలుగురే కారణం

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:27 AM

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదలైన థియేటర్ల సమస్యకు ఇండస్ట్రీలోని నలుగురు వ్యక్తులే కారణమని, వారే తమ స్వార్థంతో థియేటర్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థను నాశనం చేస్తున్నారని టీఫ్‌సీసీ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌...

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదలైన థియేటర్ల సమస్యకు ఇండస్ట్రీలోని నలుగురు వ్యక్తులే కారణమని, వారే తమ స్వార్థంతో థియేటర్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థను నాశనం చేస్తున్నారని టీఫ్‌సీసీ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ఆరోపించారు. టీఫ్‌సీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘గద్దర్‌ అవార్డుల్లో తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అన్యాయం జరిగింది. నేను 1992లో ఇండస్ట్రీకి వచ్చాను. 2002 వరకు థియేటర్లలో పర్సంటేజీ విధానం ఉండేది. ఆ తర్వాత కొందరు తమ స్వార్థంతో రెంట్‌ సిస్టమ్‌ మొదలు పెట్టారు. ఏపీలో థియేటర్ల వ్యవస్థ ప్రక్షాళనకు డీప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నాం’ అని అన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 05:27 AM