ఆదరణ ఆనందాన్నిస్తోంది

ABN , Publish Date - Feb 17 , 2025 | 02:58 AM

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తండేల్‌’. ఈ చిత్రానికి దక్కుతున్న ఆదరణ పట్ల...

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తండేల్‌’. ఈ చిత్రానికి దక్కుతున్న ఆదరణ పట్ల చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది. అక్కినేని అభిమానులకు సూపర్‌హిట్‌చిత్రాన్ని అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆదివారం చిత్రబృందం తెలిపింది. నాగచైతన్య, సాయిపల్లవి నటన, చందు మొండేటి దర్శకత్వ ప్రతిభతో ఈ అద్భుతం సాఽధ్యమైందని పేర్కొంది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే.


For Telangana News And Telugu News

Updated Date - Feb 17 , 2025 | 02:59 AM