మనసును తాకేలా

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:28 AM

సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌,...

సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌, టీజీ కృతిప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 17 సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఊహించని మలుపులతో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసును తాకేలా ఉంటుందని తెలిపారు.

Updated Date - Jun 03 , 2025 | 04:28 AM