పళని దేవాలయంలో పూజలు
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:24 AM
సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రం (సూర్య 46-వర్కింగ్ టైటిల్) ప్రారంభమైన విషయం తెలిసిందే. టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార...
సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రం (సూర్య 46-వర్కింగ్ టైటిల్) ప్రారంభమైన విషయం తెలిసిందే. టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాయి. వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీతో కలసి హీరో సూర్య గురువారం పళని మురుగన్ ఆలయాన్ని దర్శించారు. మురుగన్ స్వామికి స్ర్కిప్ట్ను సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ‘లక్కీ భాస్కర్’ ఘన విజయం తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రమిది. సూర్యకు తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం ఇదే. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.