Director Rajamouli: సైనికుల ఫొటోలు, వీడియోలు తీయొద్దు

ABN , Publish Date - May 10 , 2025 | 06:48 AM

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో రాజమౌళి సోషల్ మీడియాలో స్పందించారు. భారత సైనిక చర్యలను ఫొటోలు, వీడియోలు తీయకుండా, అవి షేర్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • రాజమౌళి

భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొందరు సోషల్‌ మీడియాలో ఫేక్‌ వీడియోలు, ఫొటోలు షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి స్పందించారు. పాజిటివ్‌గా, అప్రమత్తంగా ఉంటే విజయం మనదేనని, సాయుధ దళాలని మెచ్చుకోవాల్సిందే అని అన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ‘ఒకవేళ భారత సైనిక చర్యలను చూస్తే ఫొటోలు, వీడియోలు తీయొద్దు. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయొద్దు. అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్టే. అనధికార ప్రకటనలు, అసత్య ప్రచారం నమ్మకండి’ అని పేర్కొన్నారు.

Updated Date - May 10 , 2025 | 06:48 AM