Akhanda 2 : బాలయ్య సరసన సంయుక్త

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:08 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అఖండ 2.. తాండవం’. ఈ సినిమాలో కథానాయికగా సంయుక్త మీనన్‌ను

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అఖండ 2.. తాండవం’. ఈ సినిమాలో కథానాయికగా సంయుక్త మీనన్‌ను ఎంపిక చేసినట్లు నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట చెప్పారు. హీరోయిన్లను అద్భుతమైన పాత్రల్లో చూపించే బోయపాటి శ్రీను సంయుక్త కోసం ఓ కీలక పాత్ర సిద్ధం చేశారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాకు ఎస్‌. థమన్‌ సంగీత దర్శకుడు. సి.రామ్‌ప్రసాద్‌ ఛాయాగ్రాహకుడు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 25న విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Also Read- Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..

Also Read-IT Raids on Tollywood: ఐటీ నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవిందేనా?

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - Jan 25 , 2025 | 05:08 AM