Payal Rajput : ఇక వెంకటలచ్చిమి అని పిలుస్తారేమో!

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:00 AM

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘వెంకటలచ్చిమి’. ముని దర్శకత్వంలో రాజా, ఎస్‌ఎస్‌ చౌదరి నిర్మించనున్న ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘వెంకటలచ్చిమి’. ముని దర్శకత్వంలో రాజా, ఎస్‌ఎస్‌ చౌదరి నిర్మించనున్న ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ముని మాట్లాడుతూ ‘కథ అనుకున్నప్పుడే పాయల్‌ రాజ్‌పుత్‌ సరిపోతారనిపించింది. పాన్‌ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఈ రివెంజ్‌ డ్రామా భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించడం ఖాయం’ అని అన్నారు. హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ ‘‘మంగళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను. నచ్చక తిరస్కరించాను. ఈ సినిమా తర్వాత నా పేరు వెంకటలచ్చిమిగా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది’ అని అన్నారు.


Also Read- Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..

Also Read-IT Raids on Tollywood: ఐటీ నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవిందేనా?

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - Jan 25 , 2025 | 05:00 AM