Rajendra Prasad: అందుకే పవన్ కల్యాణ్.. సీరియస్గా తీసుకున్నాడు
ABN , Publish Date - May 29 , 2025 | 01:49 AM
‘పవన్ కల్యాణ్ ఇప్పుడు సాదాసీదా వ్యక్తి కాదు. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. గొప్ప పదవిలో ఉన్నాడు. ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయనపైన ఉంది. కాబట్టే థియేటర్ల మూసివేత అంశాన్ని..
‘పవన్ కల్యాణ్ ఇప్పుడు సాదాసీదా వ్యక్తి కాదు. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. గొప్ప పదవిలో ఉన్నాడు. ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయనపైన ఉంది. కాబట్టే థియేటర్ల మూసివేత అంశాన్ని సీరియ్సగా తీసుకున్నాడు’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన కీలకపాత్రలో నటించిన ‘షష్టిపూర్తి’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ‘మా పవన్ ఫీలయ్యాడు అంటే అందులో బాధ్యత ఉంటుంది. ‘నాసినిమా విడుదలకు ముందు ఇలా చేయడం ఏంటి’ అని ఆయన ఆవేదనకు గురవడం సహజం. అందుకే ‘ఏం జరిగిందో కనుక్కోండి, ఆపండి’ అన్నాడు. ఆయనది మంచి నిర్ణయమే. దీనికంతటికీ కారకులు ఎవరో వాళ్లను పట్టుకొని ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుంటే గనుక ఈ సమస్య ఇంతటితో సమసిపోతుంది. అందుకే పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకొని ఎందుకలా జరిగింది కనుక్కోమని అధికారులను ఆదేశించారు. ఎవరో ఒక పిచ్చి నిర్ణయం తీసుకుంటే అది మీడియాలో ప్రముఖంగా ప్రచారం అయింది. థియేటర్ల మూసివేత అనేది చిన్న విషయం కాదు ?ఎవరో ఒకరు నిర్ణయం తీసుకున్నంత మాత్రాన సరిపోతుందా? అందర్నీ తప్పుదారి పట్టించారు. కానీ అందరి ఆమోదం లేకపోబట్టే చివరకు అది వీగిపోయింది’ అని చెప్పారు.