విడుదలకు సిద్ధం
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:18 AM
సత్యం రాజేశ్, శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘పాడేరు 12వ మైలురాయి’. ఎన్.కే దర్శకత్వంలో తోలేటి కృష్ణ నిర్మించారు...
సత్యం రాజేశ్, శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘పాడేరు 12వ మైలురాయి’. ఎన్.కే దర్శకత్వంలో తోలేటి కృష్ణ నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమాను తెరకెక్కించాం. సస్పెన్స్తో పాటు చక్కని ప్రేమకథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది’ అని చెప్పారు. బీభత్సరసం ప్రధాన కఽథాంశంగా పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రమిది అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: పీ ఆర్, సినిమాటోగ్రఫీ:జి. అమర్.