డబ్బింగ్‌ షురూ

ABN , Publish Date - Jun 12 , 2025 | 06:11 AM

రోషన్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. అయన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఎన్టీఆర్‌ బుధవారం...

రోషన్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. అయన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఎన్టీఆర్‌ బుధవారం తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించారు. ‘వార్‌ 2 డబ్బింగ్‌ ప్రారంభం’ అంటూ ఎన్టీఆర్‌ స్టూడియోలోకి అడుగుపెడుతున్న వీడియోను చిత్రబృందం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఎన్టీఆర్‌కు ఇది తొలి హిందీ చిత్రం. ఈ స్పై థ్రిల్లర్‌లో సీక్రెట్‌ ఏజెంట్‌గా ఆయన డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. కియారా అద్వాణీ ఈ చిత్రంలో కథానాయిక. గతంలో హృతిక్‌రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన ‘వార్‌’ చిత్రానికి ఇది కొనసాగింపు. ఆదిత్యా చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Jun 12 , 2025 | 06:11 AM