సంగీతానికే తొలి ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:14 AM
నరేశ్ అగస్త్య, రబియా ఖతూన్ జంటగా విపిన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. సునేత్ర ఎంటర్టైన్మెంట్ బేనర్పై ఉమాదేవి కోట నిర్మిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్...
నరేశ్ అగస్త్య, రబియా ఖతూన్ జంటగా విపిన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. సునేత్ర ఎంటర్టైన్మెంట్ బేనర్పై ఉమాదేవి కోట నిర్మిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్ను విడుదల చేశారు. ఒక ప్రతిభావంతుడైన సంగీతకారుని చుట్టూ చిత్రకథ తిరుగుతుంది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు విపిన్ మాట్లాడుతూ ‘మా సినిమాలో ప్రిన్స్ రామ వర్మ అనే పెద్ద సంగీత విద్వాంసులు అతిథి పాత్రలో నటించారు. ఆయన సినిమాలో పాట కూడా పాడారు.’ అని అన్నారు. నిర్మాత ఉమాదేవి మాట్లాడుతూ ‘ప్రతి సినిమాలో కళని కనెక్ట్ చేయాలనేది నా ఆశ. అందుకే ఈ సినిమాలో సంగీతానికే తొలి ప్రాధాన్యం ఇచ్చాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ. సంగీతం : జస్టిన్ ప్రభాకరన్.