సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు.. 

ABN , Publish Date - Aug 04 , 2025 | 06:08 PM

విద్యార్థులు గంజాయి కోరల్లో చిక్కుతున్నారు. పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు దర్శనమిస్తున్నాయి. డిగ్రీలు పూర్తి చేయకముందే డ్రగ్స్ కి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.

విద్యార్థులు గంజాయి కోరల్లో చిక్కుతున్నారు. పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు దర్శనమిస్తున్నాయి. డిగ్రీలు పూర్తి చేయకముందే డ్రగ్స్ కి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన వయసులో మత్తు అనే ఊబిలో కూరుకు పోతున్నారు. ఇదేంటని అడిగిన తల్లిదండ్రులపై దాడులు చేసే పశు ప్రవర్తనలకు దిగజారి పోతున్నారు. ప్రశ్నించిన వారిపై పగ పెంచుకుంటున్నారు. మత్తుకు బానిసై ముఠాగా ఏర్పడి విక్రయాలు సైతం జరుపుతున్నారు. అదే మత్తులో హత్యలు, అత్యాచారాల వంటి ఆరాచకాలు ఎన్నో. అలాంటి డ్రగ్స్‌ను అరికట్టేందుకు త‌న‌వంతు బాధ్య‌త‌గా హీరో కృష్ణసాయి (Krishna Sai) పలు వీడియోలు తీస్తున్నారు. 

డ్ర‌గ్స్‌పై యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు స్పందించిన హీరో కృష్ణసాయి ప‌లు ప్ర‌చార చిత్రాల‌ను రూపొందిస్తున్నారు. కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ నిర్మాణంలో ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ (O yuvatha Nee gamyam etu vaipu) అనే సందేశంతో రూపొందించిన ప్రచార వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ సంద‌ర్బంగా తెలుగు ఫిలిం ఛాంబర్ లో హీరో కృష్ణసాయి మాట్లాడుతూ.. “తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా బాధ్యతగా డ్రగ్స్‌పై ఓ చైతన్యపూరిత గీతాన్ని రూపొందించాం. గ‌వ‌ర్న‌ర్లు, పోలీస్ విభాగంతో పాటు, సామాజిక మాధ్యమాల్లోనూ ప్ర‌శంసలు వెల్లువెత్తాయి. ప్రతి సినిమాకి ముందు 'స్మోకింగ్ డేంజర్' అని హెచ్చరికలు చేసే మెసేజ్ వలన యువతలో అవ‌గాహ‌న క‌లిగడంతో సిగరెట్, తంబాకు, గుట్కా వినియోగం బాగా తగ్గిపోయింది, సినిమా మాధ్య‌మం వ‌ల్ల ప్ర‌జ‌లు ప్రభావితం అవుతారు. అందుకే ఇప్పుడు డ్రగ్స్‌పై అవగాహన పెంచేందుకు మేం రూపొందించిన పాట‌ను ‘డేంజర్’ అనే సినిమాలోనిది. ఈ సినిమా యువతను మార్పు దిశగా నడిపిస్తుందని నమ్మకం ఉంది,” అని అన్నారు.   

Updated Date - Aug 04 , 2025 | 06:09 PM