కామెడీ మిస్టరీ కలబోతగా

ABN , Publish Date - Jun 02 , 2025 | 04:22 AM

సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘గ్యాంబ్లర్స్‌’. ప్రశాంతి చారులింగా కథానాయిక. కేఎ్‌సకే చైతన్య దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్‌ బృందావనం నిర్మిస్తున్నారు...

సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘గ్యాంబ్లర్స్‌’. ప్రశాంతి చారులింగా కథానాయిక. కేఎ్‌సకే చైతన్య దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్‌ బృందావనం నిర్మిస్తున్నారు. ఈనెల 6న ఈ చిత్రం విడుదలవుతోంది. చిత్రబృందం శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ బృందావనం మాట్లాడుతూ ‘గతంలో మా సంస్థలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ గారి దర్శకత్వంలో ‘శ్రీవల్లి’ అనే చిత్రాన్ని నిర్మించాం. ఇప్పుడు వైవిధ్యమైన కథాంశంతో ‘గ్యాంబ్లర్స్‌’ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్ష కుల మనసు దోచుకుంటుంది’ అని అన్నారు. ఈ సినిమాలో సంగీత్‌ శోభన్‌ నటనలో కొత్తకోణాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు అని సునీత చెప్పారు. కామెడీ, మిస్టరీ, గ్లామర్‌ కలబోతగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు.

Updated Date - Jun 02 , 2025 | 04:22 AM